జేపీ పవర్ (జైప్రకాష్ పవర్ వెంచర్స్) షేర్లు గత రెండు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం, నవంబర్ 20న ఈ షేరు ధర NSE లో 12% వరకు పెరిగి రూ. 22.79 గరిష్ట స్థాయిని తాకింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్టాక్ ఏకంగా 27 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే ఒకపక్క జేపీ పేరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్(JAL) దివాలా ప్రక్రియలో ఉంటే జేపీ పవర్ షేర్లు ఎందుకు ఇలా ర్యాలీ అవుతున్నాయి. అసలు కారణం ఏంటంటే..

జేపీ పవర్ పేరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం ఈ వార్తల ఆధారంగానే జేపీ పవర్ షేర్లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. జైప్రకాష్ అసోసియేట్స్ (JAL) కంపెనీకి జేపీ పవర్ (JP Power) లో సుమారు 24% వాటా ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న అదానీ గ్రూప్ JAL ను దక్కించుకుంటే దాని ప్రభావం JAL కింద ఉన్న JP Power పై కూడా సానుకూలంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అంచనా ఇదే..
అదానీ వంటి పటిష్టమైన గ్రూప్ JP Power లోకి పరోక్షంగా ప్రవేశిస్తే కంపెనీ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. తద్వారా JP Power బిజినెస్ వాల్యూ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదానీ గ్రూప్ ఎంట్రీ ఇవ్వడం వల్ల JP Power కి బ్యాలెన్స్ షీట్ బలం పెరుగుతుందని లాంగ్ టర్మ్ లో కంపెనీ మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
అదానీ vs. వేదాంత
రుణాలు చెల్లించడంలో విఫలమైన జైప్రకాష్ అసోసియేట్స్ (JAL) దివాలాకు దగ్గర్లో ఉంది. అయితే ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి అదానీతోపాటు వేదాంత (Vedanta) కూడా పోటీ పడుతుంది. వేదాంత రూ. 17,000 కోట్లతో బిడ్ వేయగా..అదానీ బిడ్ రూ. 13,500 కోట్లు బిడ్ వేసింది. వేదాంత కంటే అదానీ గ్రూప్ బిడ్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు అదానీ బిడ్నే ఎంచుకున్నాయి. అదానీ గ్రూప్ వెంటనే డబ్బు చెల్లించడానికి అంగీకరించడంతోపాటు చెల్లింపుల గడువును 1.5-2 సంవత్సరాలుగా నిర్ణయించింది. దాంతో బిడ్ అదానీకి దక్కింది.
ఇప్పుడు కొనొచ్చా?
ప్రస్తుతం జేపీ పవర్ షేర్ ధర(jp power share price) భారీగా ర్యాలీ అవుతుంది. అదానీ గ్రూప్ రాకపై ఉన్న అంచనాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. అయితే ఈ డీల్కు సంబంధించి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ తుది నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ పెరుగుదల నిలబడుతుందో లేదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు మరికొన్ని రోజులు వేచి చూశాక పెట్టుబడి పెడితే మంచదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఇకపై 24 గంటలూ పనిచేస్తుందా? ఇది సాధ్యమేనా? ఇన్వెస్టర్లు ఏమంటున్నారు?

ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. స్టాక్ మార్కెట్కి మార్చి నెలలో 12 రోజులు సెలవులు... పూర్తి లిస్ట్ ఇదిగో..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications