ఇన్వెస్టర్లు ఇక క్యాష్ రెడీ చేసుకోండి.. వచ్చేవారం మెగా ఐపీఓల జాతర.. ఆ ఒక్క ఐపీఓపైనే అందరి కన్ను..

IPO Boom: భారతదేశ ప్రాథమిక స్టాక్ మార్కెట్ (Primary Market) మరో అత్యంత బిజీ వారానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 42 ప్రధాన కంపెనీలు ఐపీఓల ద్వారా రూ. 54,378 కోట్లు సమీకరించగా, ఆగస్టు 17 నుండి ఆగస్టు 21 మధ్య మరొక ఐదు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. వీటి ద్వారా మొత్తం రూ. 5,499.32 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదే సమయంలో.. ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.

ఆగస్టు 17 సోమవారం నాడు హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, లలితా జ్యువెలరీ మార్ట్ తమ ఐపీఓలను ప్రారంభిస్తున్నాయి. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ రూ. 2,600 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈ వారంలో వచ్చే ఐదు ఐపీఓల మొత్తం నిధుల సమీకరణలో ఒక్క హొరైజన్ వాటాయే దాదాపు 47 శాతంగా ఉంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 57 నుండి రూ. 60 ధరల శ్రేణిని నిర్ణయించింది. రెండవ అతిపెద్ద ఇష్యూగా వస్తున్న లలితా జ్యువెలరీ మార్ట్ రూ. 1,700 కోట్లను లక్ష్యంగా పెట్టుకుని.. ఒక్కో షేరు ధరను రూ. 190 నుండి రూ. 201గా నిర్ణయించింది. ఈ రెండు ఇష్యూలు ఆగస్టు 19 వరకు పెట్టుబడుల కోసం తెరిచి ఉంటాయి.

IPO Rush 2026 Upcoming IPOs IPO Calendar August 2026 5 499 Crore IPO Shiprocket IPO Shiprocket Listing Lalithaa Jewellery IPO Horizon Industrial Parks IPO Shankesh Jewellers IPO Sunshine Pictures IPO Gaza Alternative Asset Management IPO IPO Listing Indian IPO Market IPO Rush IPO 5499 IPO IPO Shiprocket Listing IPO Horizon Industrial Parks IPO Shankesh Jewellers IPO Sunshine Pictures IPO Gaza Alternative Asset Management IPO IPO IPO IPO

ఆగస్టు 18న శంకేష్ జ్యువెలర్స్, సన్‌షైన్ పిక్చర్స్ తమ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. శంకేష్ జ్యువెలర్స్ ఒక్కో షేరుకు రూ. 88 నుండి రూ. 93 ధరల శ్రేణితో రూ. 367.18 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, సన్‌షైన్ పిక్చర్స్ ఒక్కో షేరుకు రూ. 342 నుండి రూ. 360 ధరల శ్రేణితో రూ. 282.14 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ రెండు ఇష్యూలు ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ వారపు చివరి ఐపీఓ అయిన గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 19న ప్రారంభమై ఆగస్టు 21న ముగుస్తుంది. ఈ కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించాలని చూస్తుండగా, షేరు ధర రూ. 152 నుండి రూ. 160 మధ్య ఉంది. ఈ ఐదు కంపెనీల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

Also Read

మరోవైపు ఇప్పటికే ఐపీఓలను పూర్తి చేసుకుని.. సంయుక్తంగా రూ. 7,478.69 కోట్లు సమీకరించిన మరో ఐదు కంపెనీల షేర్లు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేయనున్నాయి. రూ. 3,066.89 కోట్లు సమీకరించిన ధూత్ ట్రాన్స్‌మిషన్, రూ. 939.70 కోట్లు సమీకరించిన మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఆగస్టు 17న లిస్ట్ కానున్నాయి. రూ. 1,553 కోట్లు సమీకరించిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ షేర్లు ఆగస్టు 18న మార్కెట్లోకి రానున్నాయి. అలాగే రూ. 1,617.48 కోట్లు సమీకరించిన షిప్‌రాకెట్, రూ. 301.62 కోట్లు సమీకరించిన బెహారీ లాల్ ఇంజనీరింగ్ కంపెనీల షేర్లు ఆగస్టు 19న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+