స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. నేడు కొనుగోలు చేస్తే డివిడెండ్ పొందే అవకాశం.. కొనాల్సిన 30 షేర్లు ఇవే..

భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్. సెబీ అమల్లోకి తెచ్చిన T+1 సెటిల్‌మెంట్ నిబంధనల ప్రకారం.. ఏదైనా కంపెనీ ప్రకటించే డివిడెండ్ లేదా బోనస్ వంటి ప్రయోజనాలకు అర్హత సాధించాలంటే.. రికార్డ్ తేదీకి కనీసం ఒక ట్రేడింగ్ రోజు ముందుగానే ఆ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాదాపు 30 కంపెనీలు తమ కార్పొరేట్ చర్యల కోసం జూలై 10వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో.. ఆయా ప్రయోజనాలను అందుకోవడానికి ఇన్వెస్టర్లకు ఈరోజే (జూలై 9) చివరి అవకాశంగా మారింది. ఈరోజు మార్కెట్ ముగిసేలోపు షేర్లను కొనుగోలు చేస్తేనే, అవి శుక్రవారం నాటికి డీమ్యాట్ ఖాతాలో జమ అయ్యి డివిడెండ్‌లకు అర్హత లభిస్తుంది.

ఈ విడతలో ప్రముఖ బ్యాంకింగ్, దిగ్గజ కార్పొరేట్ సంస్థలు భారీగా డివిడెండ్లను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూపాయి చొప్పున డివిడెండ్ ప్రకటించగా.. స్టాక్ ఎక్స్ఛేంజ్ దిగ్గజం బీఎస్ఈ ఒక్కో షేరుకు 10 రూపాయల డివిడెండ్ చెల్లించడానికి సిద్ధమైంది.

187 Dividend Alert Dividend Stocks Axis Bank Dividend BSE Dividend Ex-Dividend Date Dividend Payout Dividend Stocks Today Stock Market News Share Market News Indian Stock Market Dividend Income High Dividend Stocks Investors NSE BSE Equity Market Business News Stock Investment Dividend Yield Ex-Date Record Date Axis Bank Stock BSE Share Price Market Updates Stocks to Buy

అలాగే ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా తన ఇన్వెస్టర్లకు మొత్తం 7 రూపాయల (5 రూపాయల తుది డివిడెండ్, 2 రూపాయల ప్రత్యేక డివిడెండ్) లాభాన్ని పంచనుంది. ఫార్మా రంగం నుండి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 8 రూపాయలు.. ఆర్టెమిస్ మెడికేర్ 45 పైసల డివిడెండ్‌ను ఇస్తున్నాయి. వీటితో పాటు జేకే సిమెంట్ 20 రూపాయలు, గ్రైండ్‌వెల్ నార్టన్ 19 రూపాయలు, నీల్కమల్ 20 రూపాయలు, హిండాల్కో ఇండస్ట్రీస్ 5 రూపాయలు, అపోలో టైర్స్ ఒక్కో షేరుకు 2.5 రూపాయల చొప్పున డివిడెండ్లను పంపిణీ చేయనున్నాయి.

సాంకేతిక నెట్‌వర్కింగ్ రంగాల విషయానికి వస్తే బిర్లాసాఫ్ట్, క్యామ్స్ (CAMS) సంస్థలు ఒక్కో షేరుకు 4 రూపాయల చొప్పున తుది డివిడెండ్‌ను అందజేస్తుండగా, డి-లింక్ ఇండియా సంస్థ ఏకంగా 27.5 రూపాయల (20 రూపాయల తుది డివిడెండ్, 7.5 రూపాయల ప్రత్యేక డివిడెండ్) భారీ మొత్తాన్ని చెల్లించనుంది. వీటితో పాటు ఏజిస్ లాజిస్టిక్స్, కంట్రోల్ ప్రింట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మహీంద్రా లాజిస్టిక్స్, న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్, ఓరియంట్ ఎలక్ట్రిక్, శోభ, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి పలు కంపెనీలు కూడా తమ వాటాదారులకు నగదు డివిడెండ్లను బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Also Read

కేవలం నగదు రూపంలోనే కాకుండా.. బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ద్వారా ఇన్వెస్టర్లకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి సంస్థ అయిన గోల్డియమ్ ఇంటర్నేషనల్ 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను (ప్రతి మూడు షేర్లకు ఒక కొత్త షేర్ ఉచితం) ప్రకటించగా.. హిందుస్థాన్ ఇన్సులేటర్స్ & ఇండస్ట్రీస్ 2:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూను ఖరారు చేసింది. మరోవైపు, మంగళం వరల్డ్‌వైడ్ సంస్థ తన షేర్ల విలువను పెంచేందుకు 1:10 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ ప్రక్రియను చేపట్టనుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+