Sensex-Nifty Cracks: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ప్రారంభంలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా మార్కెట్లు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను ఫాలో అవుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుపై చేసిన ప్రకటనతో యూఎస్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్న తర్వాత ప్రపంచ మార్కెట్లు సైతం అదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ తాజాగా మానిటరీ పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తూ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించినందున మెుత్తం 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత జరిగింది. ఇదే క్రమంలో 2025 కోసం ద్రవ్య విధాన సడలింపుల విషయంలో హాకిష్ వ్యూ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అయితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్లు సంతోషంగా లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 1000 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సూచీ సైతం 24,000 పాయింట్ల కింద ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ఉదయం 9.58 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 810 పాయింట్ల మేర పతనంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 240 పాయింట్లకు పైగా నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 580 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 430 పాయింట్లకు పైగా పతనంతో ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, బ్యాంక్ నిఫ్టీ సూచీలు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. విప్రో, హిందాల్కొ, ఇన్ఫోసిస్ స్టాక్స్ పతనంలో సూచీలను నష్టాల్లోకి లాగుతున్నాయి. పెరిగిన భయాందోళనలతో ఐటీ స్టాక్స్ విక్రయించేందుకు ఇన్వెస్టర్లు ప్రధానంగా మెుగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిపుణుల అంచనా ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ 2025లో మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్రిప్టోలపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి ట్రంప్ రాకతో క్రిప్టోలకు మంచిరోజులు వస్తాయనే ఊహాగానాలతో ఇటీవల బిట్ కాయిన్ మెగా ర్యాలీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటికి పావెల్ చెక్ పెట్టారని తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బిట్ కాయిన్లను హోల్డ్ చేసేందుకు అనుమతించబడదని వెల్లడించారు. అయితే దీనిపై నిర్ణయాన్ని కాంగ్రెస్ కు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. బంగారం మాదిరిగానే బిట్ కాయిన్లను హోల్డ్ చేసేందుకు ఫెడ్ కి వీలు ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకు పావెల్ బదులిస్తూ క్లారిటీ ఇవ్వటంతో క్రిప్టో ధరలు ప్రభావితం అవుతున్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు..
- నేడు ఇంట్రాడేలో ఐటీ స్టాక్స్ విక్రయిస్తుండటంతో ఇండియా విక్స్ సూచీ 14.37 మార్కుకు పెరిగింది.
- డాలర్ ఇండెక్స్ 108 కంటే ఎక్కువగా పెరిగింది
- 10 సంవత్సరాల యూఎస్ బాండ్ ఈల్డ్స్ 4.52 శాతానికి పెరుగుదల
- భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డబ్బును విక్రయాలతో వెనక్కి తీసుకోవటం
- డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు బెదిరింపులు
- 2025లో ట్రంప్ సుంకాలు పెంచటంతో ద్రవ్యోల్బణం తిరిగి పెరగటం వల్ల వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదించే అవకాశాలు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications