IPO News: నిరాశపరిచిన అతిపెద్ద ఐపీవో..హ్యుందాయ్ షేర్లు అమ్మలా? కొనాలా లేక హోల్డ్ చేయాలా?

Hyundai IPO: దేశంలో ఐపీవోల మార్కెట్ పెద్ద బూమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన ఐపీవోల్లో 95 శాతం లాభాల్లోనే లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన ఆటో దిగ్గజ సంస్థ ఐపీవో నేడు దలాల్ స్ట్రీట్ సూచీల్లో జాబితా చేయబడింది. మెుదటి నుంచే పెద్దగా ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ కొరవడిన ఐపీవో చివరికి నిరాశాజనకమైన ప్రయాణాన్ని మెుదలు పెట్టింది.

దేశంలోనే కాక ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఐపీవోగా వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టింది. అయితే ఇది బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు మాత్రం అరంగేట్రంలో నిరాశనే మిగిల్చింది. లిస్టింగ్ ముందు గ్రే మార్కెట్లో ప్రీమియం చాలా తక్కువగా ఉండటం ఇన్వెస్టర్లలో అనుమానాలను కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు 1 శాతానికి పైగా డిస్కౌంటెడ్ ధర వద్ద జాబితా అయ్యాయి. మ్యూటెడ్ లిస్టింగ్ చాలా మంది ట్రేడర్లను నిరాశకు గురిచేసింది.

Hyundai IPO dissapointed investors with discounted listing on first day Know brokerages call

వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.1960కి విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే లిస్టింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కో స్టాక్ 1,934 ధర వద్ద జాబితా అవగా, బీఎస్ఈలో ఒక్కో షేరు రూ.1931 రేటుకు అడుగుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లకు లాభాల మాట పక్కన పెడితే 1 శాతానికి పైగా లిస్టింగ్ నష్టం మిగిలింది.

ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే మే 1996లో స్థాపించబడిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌లో ఒక భాగం. ప్రయాణీకుల వాహన విక్రయాల ఆధారంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ఉంది. కంపెనీ నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాల తయారీతో పాటు ట్రాన్స్‌మిషన్‌లు, ఇంజిన్‌ల వంటి భాగాల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది.

Hyundai IPO dissapointed investors with discounted listing on first day Know brokerages call

ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 1,366 సేల్స్ పాయింట్లు, 1,550 సర్వీస్ పాయింట్ల నెట్‌వర్క్‌ కలిగి ఉంది. మార్చి 31 నాటికి కంపెనీ దేశంలో, ఎగుమతుల రూపంలో 1.2 కోట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం కంపెనీ విక్రయిస్తోంది.

షేర్లపై బ్రోకరేజ్ మాట..
నేడు మార్కెట్లో లిస్ట్ అయిన హ్యుందాయ్ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బ్రోకరేజ్ హ్యుందాయ్ మోటార్ ఇండియాపై రెడ్యూస్ రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు లిస్ట్ అయిన కంపెనీ షేర్లకు రూ.1,750 టార్గెట్ ధరగా పేర్కొంది. ఆటో దిగ్గజ సంస్థకు ఇండియాలో బలమైన ఫ్రాంచైజీ ఉందని పేర్కొంది. కానీ మ్యూట్ చేయబడిన వృద్ధి ఔట్‌లుక్ మధ్య కార్‌మేకర్ అధిక వాల్యుయేషన్‌లో ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+