భారతీయ క్విక్-కామర్స్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతున్న బ్లింకిట్, దాని పేరెంట్ కంపెనీ ఎటర్నల్ పెట్టుబడిదారులకు లాభాల పంటను పండించాయి.ఈ రోజు స్టాక్ మార్కెట్లో ఎటర్నల్ లిమిటెడ్ షేర్లు దుమ్ము రేపాయి. కేవలం 2 నిమిషాల్లో రూ. 1000 కోట్ల లాభాన్ని కంపెనీ అధినేతకు అందించాయి. ఎటర్నల్ లిమిటెడ్ (జోమాటో) షేర్లు మంగళవారం ట్రేడింగ్లో 15 శాతం వరకు పెరిగాయి.ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.311.60కి చేరుకున్నాయి. ఈ షేర్లు దూసుకుపోవడంతో ఎటర్నల్ లిమిటెడ్ CEO వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండు నిమిషాల్లోనే రూ.1,000 కోట్లకు అధిపతి అయ్యాడు.కేవలం రెండు రోజుల్లోనే ఆయన నికర విలువ రూ. 2 వేల కోట్లకు పైగా పెరిగింది.
42 ఏళ్ల IITian అయిన దీపిందర్ గోయల్ కంపెనీలో జూన్ త్రైమాసికం చివరి నాటికి 3.83% వాటా కలిగి ఉన్నారు. తాజాగా స్టాక్ మార్కెట్లో షేర్లు దూసుకుపోవడంతో ఎటర్నల్లో ఆయన వాటా అంచనా విలువ సోమవారం రూ.1,001 కోట్లు పెరిగి రూ.10,024 కోట్ల నుండి రూ.11,025 కోట్లకు చేరుకుంది. గత సెషన్ లో కూడా ఎటర్నల్ షేర్లు మొదటి త్రైమాసికంలో 5.64 శాతం పెరిగాయి. కేవలం రెండు రోజుల వృద్ధిలో బిలియనీర్ దీపిందర్ గోయల్ మొత్తం సంపద దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగింది.

హోటళ్ల నుండి ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, త్వరిత డెలివరీ సౌకర్యాన్ని అందించే ఎటర్నల్ కంపెనీ.. నిన్న (జూలై 21) జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.25 కోట్లకు తగ్గింది. పెరిగిన ఖర్చుల కారణంగా కంపెనీ లాభం తగ్గింది. ఎటర్నల్ కంపెనీ జొమాటో, బ్లింకిట్ బ్రాండ్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 ఇదే త్రైమాసికంలో ఎటర్నల్ రూ.253 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఎటర్నల్ నిర్వహణ ఆదాయం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.4,206 కోట్ల నుండి రూ.7,167 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. బ్లింకిట్ ఫుడ్స్ ఏర్పాటు గురించి కంపెనీ స్టాక్ మార్కెట్కు కూడా తెలియజేసింది. అయితే ఈ ఏర్పాటు తర్వాత బ్లింకిట్ ఫుడ్స్ కంపెనీకి పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, సంబంధిత పార్టీగా ఉంటుంది.
మొదటి త్రైమాసికంలో ఎటర్నల్ మరోసారి తమను ఆశ్చర్యపరిచే ఫలితాలను రాబట్టిందని జెఎం ఫైనాన్షియల్ తెలిపింది. అనుకున్న సంఖ్యల కంటే ఎక్కువ నంబర్స్ సాదించింది. ఎందుకంటే ఇది Q4 FY25 ఫలితాల తర్వాత తీసుకున్న జాగ్రత్త వైఖరి నుండి పదునైన నిష్క్రమణ అని బ్రోకరేజ్ తెలిపింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం గోయల్ నికర ఆస్తులు ప్రస్తుతం 1.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతున్నాయి.
Eternal షేర్లు రూ. 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ దాటాయి. ఈ విలువతో అది విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజాలను కూడా అధిగమించింది.ఎటర్నల్ ర్యాలీ ప్రభావం ప్రత్యర్థి స్విగ్గీపై కూడా పడింది, దాని స్టాక్ 7 శాతానికి పైగా పెరిగింది. అదేవిధంగా, ఎటర్నల్లో 12.38 శాతం వాటా కలిగిన ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) కూడా 3 శాతం పైగా లాభపడి, దాని మార్కెట్ క్యాప్లో మూడో వంతు విలువ ఇప్పుడు ఎటర్నల్ స్టాక్ హోల్డింగ్ ద్వారానే వచ్చింది.
భారతదేశంలో ఫుడ్ డెలివరీ, డిజిటల్ వాణిజ్యం వేగంగా విస్తరిస్తుండటంతో బ్లింకిట్ మార్కెట్ లీడర్ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారులు Eternal ను దీర్ఘకాలిక వృద్ధి కంపెనీగా చూస్తున్నారు.
బ్రోకరేజ్ల అంచనా ప్రకారం, బ్లింకిట్ మార్జిన్లు మరింత మెరుగుపడి, ఫుడ్ డెలివరీ కంటే పెద్ద వ్యాపార విభాగంగా మారబోతుందని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications