Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఈ పరిస్థితులతో గందరగోళానికి గురవుతున్నారు.
వాస్తవానికి నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కావటంతో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. దీంతో మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ క్యాప్ దాదాపు రూ.425 కోట్లకు తగ్గింది. నేడు మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవటానికి కారణం పెట్టుబడిదారులు అప్రమత్తం కావటమైనని తెలుస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ పొరుగు దేశాలపై వాణిజ్య పన్నులకు సంబంధించిన ప్రకటనలతో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం మేర పతనాన్ని నమోదు చేశాయి.

అకస్మాత్తుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నమోదైన అమ్మకాలతో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. అయితే మార్కెట్ల భారీ పతనానికి కారణమైన 5 ప్రధాన అంశాలను పరిశీలిస్తే..
* ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ అలుముకున్న అనిశ్చితులు మార్కెట్లలో పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలపై పన్ను టారిఫ్ ల గురించి కూడా ట్రంప్ తన ప్రకటనలో వెల్లడించారు. అలాగే భారత్ సహా మరికొన్ని దేశాలకు ఇదే క్రమంలో పన్నులు పెంచుతానని, తీరుమార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రధానంగా ఈ నిర్ణయాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని తెలుస్తోంది. ట్రంప్ 2.0 ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
* ఇదే క్రమంలో ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగం కోసం ఆసక్తిగా పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. నిర్మలమ్మ ఏఏ రంగాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తారోనని వేచి చూస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ రంగంతో పాటు దేశంలో వినియోగాన్ని పెంచటానికి ప్రభుత్వం ఫోకస్ కొనసాగించవచ్చని తెలుస్తోంది. కేటాయింపులు నిరాశ కలిగిస్తే మార్కెట్ సెంటిమెంట్లు ప్రతికూలంగా ప్రభావితం కావొచ్చు.
* విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లలో తమ ఇన్వెస్ట్మెంట్లను విక్రయిస్తున్నారు. అమెరికన్ డాలర్ బలంగా ఉండటంతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరుగుదల పెట్టుబడుల విక్రయించేలా ప్రేరేపిస్తోందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 1 నుంచి 20 వరకు పెట్టుబడిదారులు దాదాపు రూ.51,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవటం మార్కెట్లలో అస్థిరతను పెంచుతోంది.
* ఇదే క్రమంలో ప్రస్తుతం దేశంలోని లిస్టెడ్ కంపెనీలు తమ మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్కెట్ అంచనాలను కంపెనీలు అందుకోవటంలో మిస్ కావటంతో పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మెుదటి త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు ఫలితాలు నిరాశాజనకంగానే ఉండటం మార్కెట్లలో సెంటిమెంట్లను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటంతో వృద్ధి రేటు కూడా తగ్గిందని వారు అంటున్నారు.
* చివరిగా మ్యాక్రో ఎకానమీ స్థాయిలో పరిస్థితులు దిగజారటం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నట్లు సంకేతాలను అందించటం మార్కెట్ పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వ క్యాపెక్స్ కూడా తగ్గుతుండటంతో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తోంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications