Market Fall: వాస్తవానికి ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని గంటల్లోనే మార్కెట్లు తిరిగి యూటర్న్ తీసుకుని నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 11 గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ నుంచి నిఫ్టీ మిడ్ క్యాప్ వరకు అన్నీ నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగించటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని కొనసాగించాలా లేక స్వస్తి పలకాలా అనే అయోమయంలో ఉన్నారు.
ఒక్కసారి మార్కెట్లు మెగా ర్యాలీలో ఉన్న రోజులకు వెళితే సెప్టెంబర్ 26, 2024న మార్కెట్ సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెన్సెక్స్ సూచీ 13 వేల పాయింట్ల వరకు కరెక్షన్ కి గురికాగా.. నిఫ్టీ సూచీ 4200 పాయింట్ల వరకు పతనాన్ని చూసింది. ఇది చాలా పెద్ద క్షీణతగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 6000 పాయింట్లకు పైగా పతనాన్ని నమోదు చేసింది.

ప్రధానంగా బీఎస్ఈ మిడ్-క్యాప్ ఇండెక్స్ దాని రికార్డు గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి పైగా పడిపోవటం ఆందోళనలు సృష్టిస్తోంది. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ సూచీ కూడా దాని గరిష్ఠాల నుంచి ఏకంగా 25 శాతానికి పైగా పతనంతో ఉండటంతో ప్రధానంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు భారీ లాభాలతో పెట్టుబడిదారులను ఆకట్టుకున్న ఈ రెండు కేటగిరీలు ప్రస్తుతం తమ గడ్డు కాలాన్ని చూస్తున్నాయి.
గత ఐదు నెలల్లో భారతీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారులు దాదాపు రూ.94 లక్షల కోట్లు కోల్పోవటంతో ప్రస్తుతం చాలా మంది మార్కెట్లలో పెట్టుబడులకు దూరంగా ఉండా లేక డిస్కౌంట్ షాపింగ్ చేయటం ద్వారా పడిపోతున్న ప్రస్తుత ధరల వద్ద మరిన్ని కొనుగోళ్లు చేపట్టాలా అనే గందరగోళంలో ఉన్నారు.
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో రక్తపాతం కొనసాగుతుండగా.. ఇన్వెస్టర్లకు ఓలటైల్ మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్ అనుకూలంగా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకుంటూ పెట్టుబడిదారుడిగా మారి డబ్బు ఆదా చేసుకునే సమయం ఆసన్నమైందని గుర్తించాలి. మార్కెట్ బుల్ ట్రెండ్ లేదా బేర్ ట్రెండ్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. అస్థిర మార్కెట్లో ఏదైనా పొజిషన్ తీసుకున్న తర్వాత నగదులో పెట్టుబడి పెట్టాలి. బలమైన స్టాప్ లాస్ను కొనసాగించాలని కూడా పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఖరీదైన మంచి స్టాక్స్ ప్రస్తుతం తక్కువ ధరల వద్ద మార్కెట్లో అందుబాటులో ఉంటాయని స్టాక్స్బాక్స్ పరిశోధన విశ్లేషకురాలు అకృతి మెహ్రోత్రా అన్నారు. గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ తీవ్ర పతనాన్ని చూసింది, ఇది ఈక్విటీ మార్కెట్లలో వాటాను పెంచడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది. అయితే స్టాక్స్ లో ఎంట్రీ ఇవ్వటానికి ముందు పెట్టుబడిదారులు సంభావ్య నష్టాలను నిశితంగా పరిశీలించాలి, తమ పెట్టుబడి సలహాదారుల వద్ద సంప్రదించటం ఉత్తమం. మెుత్తానికి పడిపోతున్న మార్కెట్లను ఇన్వెస్టర్లు ఎలా ఉపయోగించుకుంటారనేది వారి అనుభవంపై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications