ప్రపంచ మార్కెట్లలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. AI స్టాక్లు బుడగగా మారుతాయనే భయం పెట్టుబడిదారుల్లో పెరుగుతోంది. Nvidia, Apple, Google, Microsoft వంటి కంపెనీలపై పెట్టుబడిదారులు ఇటీవల సంవత్సరాల్లో చాలా మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఈ కారణంగా అమెరికా మార్కెట్, తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్ ఆధారిత దేశాలు భారీగా డబ్బును ఆకర్షించాయి. ఈ డబ్బు ప్రవాహాల వల్ల భారత నిఫ్టీ 50 మాత్రం 2025లో ఎక్కువగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి AI వాణిజ్యం ఉన్న దేశాలపైనే నిలిచిపోయింది.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, OpenAI సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాల హెచ్చరికలు పెట్టుబడిదారులను ఆలోచనలో పడేశాయి. వీరంతా AIలో కొంత అహేతుకం, బుడగల లక్షణాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. పెట్టుబడిదారుల్లో మరింత భయం కలిగించిన విషయం ఏమిటంటే.. పీటర్ థీల్ తన Nvidia వాటాలు అమ్మడం.ఇక మైఖేల్ బర్రీ Nvidiaపై బేరిష్ పందెం వేశాడు. 2008 హౌసింగ్ మార్కెట్ క్రాష్ను ముందుగానే చెప్పిన వ్యక్తి AI స్టాక్లపై బేరిష్గా మారడం అంత తేలికైన విషయం కాదు.

ఈ భయం పెరుగుతున్న కొద్దీ, ఇప్పటివరకు తైవాన్, కొరియా వైపు పరిగెత్తిన డబ్బు తిరిగి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం పెరుగుతోంది. విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం.. AI ట్రేడ్ నెమ్మదిగా కూలిపోతే, పెట్టుబడిదారులు టెక్ నిర్బంధం లేని, స్థిరంగా ఉన్న మార్కెట్లను చూస్తారు. ఆ జాబితాలో మొదటగా కనిపించే దేశం భారతదేశమే. ఎందుకంటే భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్కువగా AI లేదా సెమీకండక్టర్ స్టాక్లపై ఆధారపడదు. నిఫ్టీ, సెన్సెక్స్లలో ప్రధానంగా బ్యాంకులు, FMCG, నిర్మాణ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల వంటి రియల్ ఎకానమీ రంగాలే ఎక్కువ. AI బుడగ పగిలినా వీటిపై పెద్ద దెబ్బ పడదు.
అదే సమయంలో.. భారత మార్కెట్లో మరో పెద్ద బలం ఏంటంటే దేశీయ పెట్టుబడిదారులు. SIPలు, మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోలు, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవాహాలు చాలా బలంగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు తాత్కాలికంగా బయటకు వెళ్లినా, దేశీయ డబ్బు మార్కెట్ను ముందుకు తీసుకువెళుతోంది. GST వసూళ్లు, క్రెడిట్ వృద్ధి, మౌలిక సదుపాయాల దూకుడు ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు గట్టి సపోర్ట్ ఇస్తున్నాయి.
విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే.. AI వాణిజ్యం 10నుండి 20 శాతం తగ్గినా కూడా, ప్రపంచ పెట్టుబడిదారులు ప్రమాదం తగ్గించుకోవడానికి భారతదేశాన్ని సేఫ్ వెంచర్గా భావించవచ్చు. తైవాన్, చైనా, కొరియా వంటి దేశాల నుండి డబ్బు భారతదేశానికి పెద్దఎత్తున చేరే అవకాశం ఉంది. గతంలో EMలకు వచ్చిన డబ్బు మొత్తం అమెరికా, AI ట్రేడ్లోనే కేంద్రీకృతమై ఉండేది. ఇప్పుడు అది తిరిగి విభజన కావాల్సిన సమయం వచ్చింది.
క్లుప్తంగా చెప్పాలంటే AI బుడగ పగలడం ప్రపంచ మార్కెట్లకు ప్రమాదం అయినా.. అదే భారతదేశానికి వృద్ధి అవకాశంగా మారవచ్చు. నిఫ్టీ 50 ఇప్పటి బలహీనతను వదిలి భవిష్యత్తులో బలమైన ర్యాలీ చూపే అవకాశం ఉంది. AI ఆధారిత దేశాలు కొంత సడలింపులోకి వెళ్తే, భారతీయ మార్కెట్లు ప్రపంచ పెట్టుబడుల కోసం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications