అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చల గురించి అధికారిక ప్రకటన చేయడానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మార్కెట్లో చోటుచేసుకున్న భారీ పెట్టుబడులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. సుమారు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్లు) విలువైన ఈ రహస్య లావాదేవీలు సాధారణ ట్రేడింగ్ లాగా కాకుండా.. ముందే సమాచారం తెలిసి చేసిన 'ఇన్సైడర్ ట్రేడింగ్' లాగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్తో చర్చలు సానుకూలంగా ఉన్నాయని.. సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి వెళ్లగా, ముడి చమురు ధరలు 15 శాతం వరకు కుప్పకూలాయి. అయితే ఈ మార్పులన్నీ జరగడానికి ముందే కొందరు ఇన్వెస్టర్లు అత్యంత ఖచ్చితత్వంతో బెట్టింగులు కాయడం గమనార్హం.

ఈ మిస్టరీ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి 'అన్ యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ సంచలన వివరాలను బయటపెట్టింది. ట్రంప్ మాట్లాడటానికి కేవలం ఐదు నిమిషాల ముందు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్ అండ్ పి 500 (S&P 500) ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో, చమురు ధరలు పడిపోతాయని ముందే ఊహించినట్లుగా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. Trump ప్రకటనకు కొన్ని సెకన్ల ముందే దాదాపు 580 మిలియన్ డాలర్ల విలువైన 6,200 ముడి చమురు కాంట్రాక్టులు చేతులు మారాయి. ఈ వ్యూహాత్మక చర్యల వల్ల ఆ ఇన్వెస్టర్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే వందల కోట్ల లాభాలను ఆర్జించారు. మార్కెట్ గమనాన్ని ఇంత ఖచ్చితంగా సెకన్ల వ్యవధిలో ఊహించడం అసాధ్యమని, దీని వెనుక వైట్ హౌస్ లోని అంతర్గత సమాచారం లీక్ అయి ఉండవచ్చని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా ఖమేనీ మరణానికి దారితీసిన సైనిక దాడులకు ముందు కూడా ప్రిడిక్షన్ మార్కెట్లలో ఇలాంటి భారీ బెట్టింగులు కనిపించాయి. ట్రంప్ తీసుకునే కీలక నిర్ణయాల గురించి ముందే సమాచారం అందుతున్న కొందరు వ్యక్తులు, పాలిమార్కెట్ మరియు కల్షి వంటి ప్లాట్ఫారమ్స్ ద్వారా మిలియన్ల కొద్దీ లాభపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ ఆరోపణలను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అధికారులు ఎవరూ అక్రమంగా లాభపడలేదని, ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఇరాన్ మాత్రం అసలు చర్చలే జరగలేదని, మార్కెట్లను ప్రభావితం చేయడానికి అమెరికా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తోంది. ఏది ఏమైనా, ఈ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి వెనుక ఉన్న వ్యక్తి లేదా సంస్థ ఎవరనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

హెచ్డిఎఫ్సి షేర్లు భారీగా పతనం.. చైర్మన్ రాజీనామాతో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

ఇరాన్ యుద్ధం.. హార్ముజ్ జలసంధిపై టెహ్రాన్ కీలక ప్రకటన.. ట్రంప్కు గట్టి వార్నింగ్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. గంటల వ్యవధిలో రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: తిరిగి పుంజుకున్న ఐటీ షేర్లు! బుల్ రన్ ఇలాగే కొనసాగుతుందా?

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

ఉగాది, రంజాన్ నాడు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుంది.. మార్చి నెలలో షేర్ మార్కెట్ హాలిడేస్ లిస్ట్ ఇదిగో..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications
