ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. టాప్ కంపెనీలు అన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఆ మొత్తాన్ని ఏఐ మీదకు మళ్లిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు చేసే పనిని ఏఐ అవలీలగా చేస్తోంది. కరోనా ప్రకంపనలు పోయిన తరువాత ఉద్యోగి కుదురుకుంటాడనే ఆశలను ఒక్కసారిగా ఏఐ తుంచిపడేసింది. తాజాగా ఏఐ రాకతో పోయే ఉద్యోగాలపై IBM సీఈఓ అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయన్న భయాలు కేవలం ఊహాగానాలు మాత్రమే కాదని.. ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయని IBM సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు. AI కొన్ని ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తుందని ఆయన అంగీకరించారు. అదే సమయంలో, సరైన నైపుణ్యాల అభివృద్ధితో కొత్త అవకాశాలు కూడా భారీగా ఏర్పడతాయని IBM CEO Arvind Krishna ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. AI వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే ఉద్యోగాల జాబితాను స్పష్టంగా ప్రస్తావించారు. ముఖ్యంగా కాల్ సెంటర్ ఉద్యోగాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తగ్గిపోతాయని ఆయన తెలిపారు. కాలక్రమేణా కాల్ సెంటర్ పాత్రలు దాదాపు 50 శాతం వరకు తగ్గిపోతాయని నేను సులభంగా ఊహించగలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్లు, ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థలు ఇప్పటికే ఈ రంగంలో మానవ అవసరాన్ని తగ్గిస్తున్నాయి.
కాల్ సెంటర్లతో పాటు అంతర్గత హెల్ప్డెస్క్ పాత్రలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఐటీ సపోర్ట్, హెచ్ఆర్ సహాయం వంటి విభాగాల్లో పనిచేసే అనేక పనులను AI సాఫ్ట్వేర్లు సమర్థంగా నిర్వహించగలవని, దీంతో ఈ విభాగాల్లో ఉద్యోగుల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా పేయబుల్ అకౌంట్స్, రిసీవబుల్ అకౌంట్స్, డాక్యుమెంట్ మ్యాచింగ్ వంటి పునరావృత పనులు చేసే ఉద్యోగాలు కూడా AI వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయని కృష్ణ హెచ్చరించారు. సంఖ్యలను సరిపోల్చడం, డేటాను ధృవీకరించడం వంటి పనులు ఆటోమేషన్కు చాలా అనుకూలమైనవని.. అందువల్ల ఈ పాత్రల్లో కోతలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఉద్యోగాల కోత మాత్రమే భవిష్యత్తు కాదని అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగుల పట్ల బాధ్యత ఉందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారిని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. AI కారణంగా కొన్ని ఉద్యోగాలు కనుమరుగైనా, కొత్త పాత్రలు తప్పకుండా ఉద్భవిస్తాయని, వాటిలోకి వెళ్లేందుకు అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అత్యంత కీలకం అని ఆయన ఐబీఎమ్ సీఈఓ నొక్కిచెప్పారు.
భవిష్యత్తులో ఎక్కువ ఉత్పాదకత కలిగిన రంగాలుగా ఆయన రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D)ను ఉదాహరణగా పేర్కొన్నారు. IBM ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తూ, R&D విభాగాన్ని విస్తరించి 10 వేల మందిని నియమించుకున్నట్లు తెలిపారు. జనరేటివ్ AI, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఆధారిత సేవలు వంటి అధిక విలువ గల విభాగాల్లో రాబోయే కాలంలో మరింత నియామకాలు జరగనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2020లో IBM సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అరవింద్ కృష్ణ సంస్థను సంప్రదాయ వ్యాపారాల నుంచి బయటకు తీసుకువచ్చి, భవిష్యత్ టెక్నాలజీల వైపు మళ్లించారు. AI ప్రభావం ఇప్పటికే IBMలో కనిపిస్తోందని, సంస్థలోని సుమారు 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల పనిని AI సాధనాలు నిర్వహిస్తున్నాయని ఆయన గతంలోనే వెల్లడించారు. క్లుప్తంగా చెప్పాలంటే AI వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం కొంతవరకు నిజమే అయినా, సరైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉద్యోగాల నికర వృద్ధి ఉద్యోగ నష్టాలను భర్తీ చేస్తుందని అరవింద్ కృష్ణ విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే, మార్పుకు భయపడకుండా, దానికి అనుగుణంగా మారడమే ఉద్యోగులకు కీలక మార్గమని స్పష్టం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications