Electoral Bonds: పెట్టుబడుల గురించి తెలుసిన వారికి బాండ్స్ గురించే తెలిసే ఉంటుంది. ఆర్థిక మాంద్యం వంటి సమయంలో చాలా మంది తమ పెట్టుబడులను ఈక్విటీ నుంచి డెట్ అంటే బాండ్స్ లోకి మారుతుంటారు. ఇందులో రకరకాల బాండ్స్ ఉన్నప్పటికీ.. ఇప్పుడు మనం ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసుకుందాం. వీటి పనితీరు వేరేగా ఉంటుంది.

ఎలక్టోరల్ బాండ్స్..
దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటికి ఎన్నికల సమయంలో భారీగా నిధులు అవసరం ఉంటుంది. అందుకే విరాళాల సేకరణకు ప్రధాన రాజకీయ పార్టీలు బాండ్లను జారీ చేస్తుంటాయి. అయితే ఈ సారి గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను విక్రయించనుంది. మెుత్తం 29 శాఖల్లో ఇవి అందుబాటులోకి ఉంటాయి.

గతంలో బాండ్ల జారీ..
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న, గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ ఉంది. అంతకుముందు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 10 వరకు 22వ దశలో, ఈ ఏడాది జూలై 1 నుంచి 10 వరకు 21వ దశలో బాండ్లను విక్రయించారు. మార్చి 1 నుంచి 10, 2018 వరకు దేశంలో తొలిసారిగా ఎన్నికల బాండ్లను విక్రయించారు. గత లోక్సభ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే బాండ్ల ద్వారా గ్రాంట్లు పొందేందుకు అర్హులని గమనించాలి. తాజా జారీలో లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్పూర్, ముంబై ఎస్బీఐ శాఖల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది.

బాండ్ల కొనుగోలు..
రూ.1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్లలో ఈ బాండ్ల అమ్మకం ఉంటుంది. సాధారణంగా ఈ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. అదే సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా 30 రోజులు అనుమతినిస్తుంది. విదేశాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనే పరిమితి కూడా ఉంది.

బీజేపీ తొలిసారిగా..
2017 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని పార్లమెంటులో మనీ బిల్లుగా ఆమోదించింది. దీని ద్వారా రాజకీయ పార్టీలకు కోట్లాది రూపాయలు సమకూరినప్పటికీ అవి ఎవరు ఇచ్చారనే విషయం మాత్రం బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ డబ్బుకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉండటం విశేషం.

ఇవి ఎవరికి లాభం..?
విరాళాలను ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచారని, ఇది నల్లధనం చలామణిని ప్రోత్సహిస్తున్నదని దేశంలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు తమ గుర్తింపును వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా అందించడానికి ఈ స్కీమ్ రూపొందించబడింది. ఇది అధికార పార్టీకి విరాళాలు ఎక్కువగా రావడానికి వేసిన ప్లాన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాలని అనుకునేవారు ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications