స్టాక్ మార్కెట్ టెక్నికల్ అవాంతరాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) సీరియస్గా ఉంది. టెక్నికల్ అవాంతరాలు గుర్తించడం, తొలగించడం, ప్రకటించడంలో పొరపాటు జరిగితే స్టాక్ ఎక్స్చేంజీలు, ఇతర మార్కెట్ మౌలిక సంస్థలతో పాటు ఉన్నతాధికారులు భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని SEBI హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు MII(మార్కెట్ మౌలిక సంస్థలు) కోసం ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెక్నికల్ సమస్యలతో ఎన్ఎస్ఈలో నాలుగు గంటల పాటు ట్రేడింగ్ నిలిచింది. ఈ పరిణామం నేపథ్యంలో సెబి చర్యలు ప్రారంభించింది.

ప్రయోజనకరం..
మార్కెట్ వ్యవస్థల పనితీరు సులభంగా సాగేలా ఉండాలని, సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించేలా ఉండాలని, లేదంటే ఫైనాన్షియల్ డిసిన్సెంటివ్స్ను MIIలు అలాగే, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చెల్లించేలా చూడాలని సెబి సోమవారం నాటి తన సర్క్యులర్లో పేర్కొంది.
తమ ఈ నిర్ణయం వ్యవస్థల పనితీరును, సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు, తద్వారా అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుందని సెబి పేర్కొంది. అదే సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చేయడంలో, ఒకవేళ సమస్య వచ్చినా కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభించేలా ప్రోత్సహిస్తుందని తెలిపింది.

ఎవరెవరికి, ఎంత జరిమానా
స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పోరేషన్, డిపాజిటరీలకు జరిమానా ఉంటుంది. రోజుకు రూ.1 లక్ష నుండి రూ.2 కోట్ల వరకు, MIIల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లకు వార్షిక వేతనంలో 10 శాతం వరకు జరిమానా ఉండవచ్చు. సెబి నిర్దేశించే వివిధ కాలవ్యవధుల ప్రకారం మారుతాయి.

జరిమానా ఇలా..
టెక్నికల్ అవాంతరానికి గల కారణాలను వెల్లడించే కాంప్రహెన్సవ్ రూట్ వెజ్ అనాలసిస్ నివేదికను సమర్పించడంలో ఆలస్యం చేస్తే జరిమానా ఉంటుంది. దీనిని 21 రోజుల్లో ఇవ్వాలి. సంఘటన జరిగిన 24 గంటల్లో ప్రాథమిక నివేదికను ఇవ్వాలి. ఒక్కో వర్కింగ్ డే ఆలస్యానికి రూ.1 లక్ష చొప్పున ఛార్జీ ఉంటుంది.
టెక్నికల్ సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుండి రూ.25 లక్షల వరకు పెనాల్టీ. ఒకటి లేదా ఎక్కువ వ్యవస్థల్లో అవాంతరాలు తలెత్తితే డిజాస్టర్గా ప్రకటించాలి. ప్రకటన ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్టాండలోన్ నికర లాభంలో సగటున పది శాతం లేదా రూ.2 కోట్లలో ఎది ఎక్కువైతే ఆ ప్రాతిపదికన కట్టవలసి ఉంటుంది. ఉన్నతాధికారులు తమ వార్షిక వేతనంలో పది శాతం చెల్లించాలి. సంఘటన జరిగిన గంటంపావు నుండి మూడు గంటల్లో సాధారణ స్థితికి తీసుకు రావాలి. లేదంటే MIIలు రూ.50 లక్షలు చెల్లించాలి. మూడు గంటలు దాటితే రూ.1 కోటి కట్టాలి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications