స్టాక్ మార్కెట్ టెక్నికల్ అవాంతరాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) సీరియస్గా ఉంది. టెక్నికల్ అవాంతరాలు గుర్తించడం, తొలగించడం, ప్రకటించడంలో పొరపాటు జరిగితే స్టాక్ ఎక్స్చేంజీలు, ఇతర మార్కెట్ మౌలిక సంస్థలతో పాటు ఉన్నతాధికారులు భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని SEBI హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు MII(మార్కెట్ మౌలిక సంస్థలు) కోసం ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెక్నికల్ సమస్యలతో ఎన్ఎస్ఈలో నాలుగు గంటల పాటు ట్రేడింగ్ నిలిచింది. ఈ పరిణామం నేపథ్యంలో సెబి చర్యలు ప్రారంభించింది.

ప్రయోజనకరం..
మార్కెట్ వ్యవస్థల పనితీరు సులభంగా సాగేలా ఉండాలని, సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించేలా ఉండాలని, లేదంటే ఫైనాన్షియల్ డిసిన్సెంటివ్స్ను MIIలు అలాగే, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చెల్లించేలా చూడాలని సెబి సోమవారం నాటి తన సర్క్యులర్లో పేర్కొంది.
తమ ఈ నిర్ణయం వ్యవస్థల పనితీరును, సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు, తద్వారా అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుందని సెబి పేర్కొంది. అదే సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చేయడంలో, ఒకవేళ సమస్య వచ్చినా కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభించేలా ప్రోత్సహిస్తుందని తెలిపింది.

ఎవరెవరికి, ఎంత జరిమానా
స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పోరేషన్, డిపాజిటరీలకు జరిమానా ఉంటుంది. రోజుకు రూ.1 లక్ష నుండి రూ.2 కోట్ల వరకు, MIIల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లకు వార్షిక వేతనంలో 10 శాతం వరకు జరిమానా ఉండవచ్చు. సెబి నిర్దేశించే వివిధ కాలవ్యవధుల ప్రకారం మారుతాయి.

జరిమానా ఇలా..
టెక్నికల్ అవాంతరానికి గల కారణాలను వెల్లడించే కాంప్రహెన్సవ్ రూట్ వెజ్ అనాలసిస్ నివేదికను సమర్పించడంలో ఆలస్యం చేస్తే జరిమానా ఉంటుంది. దీనిని 21 రోజుల్లో ఇవ్వాలి. సంఘటన జరిగిన 24 గంటల్లో ప్రాథమిక నివేదికను ఇవ్వాలి. ఒక్కో వర్కింగ్ డే ఆలస్యానికి రూ.1 లక్ష చొప్పున ఛార్జీ ఉంటుంది.
టెక్నికల్ సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుండి రూ.25 లక్షల వరకు పెనాల్టీ. ఒకటి లేదా ఎక్కువ వ్యవస్థల్లో అవాంతరాలు తలెత్తితే డిజాస్టర్గా ప్రకటించాలి. ప్రకటన ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్టాండలోన్ నికర లాభంలో సగటున పది శాతం లేదా రూ.2 కోట్లలో ఎది ఎక్కువైతే ఆ ప్రాతిపదికన కట్టవలసి ఉంటుంది. ఉన్నతాధికారులు తమ వార్షిక వేతనంలో పది శాతం చెల్లించాలి. సంఘటన జరిగిన గంటంపావు నుండి మూడు గంటల్లో సాధారణ స్థితికి తీసుకు రావాలి. లేదంటే MIIలు రూ.50 లక్షలు చెల్లించాలి. మూడు గంటలు దాటితే రూ.1 కోటి కట్టాలి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications