సెబీ బోర్డు మంగళవారం గోల్డ్ ఎక్స్చేంజ్ బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో బంగారం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ రూపంలో వర్తకం చేయబడుతుంది. అలాగే, పారదర్శక డొమెస్టిక్ స్పాట్ ప్రైస్ను కలిగి ఉండటానికి దోహదపడుతుంది. బంగారాన్ని సూచించే పరిరకాలను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అని పిలుస్తారు. సెక్యూరిటీస్గా నోటిఫై చేస్తారని బోర్డు మీటింగ్ అనంతరం సెబి చైర్మన్ అజయ్ త్యాగి పేర్కొన్నారు. ఇతర సెక్యూరిటీస్ మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్స్ను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్(EGRs) కలిగి ఉంటాయన్నారు.
ఏదైనా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్, కొత్తది లేదా ఇప్పటికే ఉన్నది EGRలలో ట్రేడింగ్ను ప్రత్యేక విభాగంలో ప్రారంభించవచ్చును. EGR ట్రేడింగ్, EGRని బంగారంగా మార్చడానికి డినామినేషన్ సెబి ఆమోదంతో స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా నిర్ణయించబడుతుంది.

ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్
బంగారానికి ప్రాతినిథ్యం వహించే EGRs, బాండ్స్ షేర్ల తరహా సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తామన్నారు. ఇతర సెక్యూరిటీల్లాగే EGRs ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్స్ను కలిగి ఉంటాయి. EGR ట్రేడింగ్, బంగారం ఫిజికల్ డెలివరీని కలిగి ఉంటుంది గోల్డ్ ఎక్స్చేంజ్. ఇది భారత దేశంలో ఒక శక్తిమంతమైన గోల్డ్ ఎకోసిస్టంను సృష్టిస్తుందని సెబి అభిప్రాయపడింది. రెగ్యులేటర్ ప్రకారం ఈజీఆర్ కొనుగోలుకు, అమ్మకానికి ఎక్స్చేంజ్ ఒక జాతీయ ప్లాట్ఫాంగా ఉంటుంది. ప్రామాణికతను కలిగి ఉంటుంది.
బంగారం ధరలకు సంబంధించి నేషనల్ ప్రైసింగ్ స్ట్రక్చర్ను క్రియేట్ చేస్తుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ చైన్లో పాల్గొనేవారికి సమర్థవంతమైన, పారదర్శకత కలిగిన ధరల ఆవిష్కరణ, పెట్టుబడి ద్రవ్యత, బంగారం నాణ్యతలో హామీ మొదలైన మొత్తం బంగారం మార్కెట్ సిస్టంకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నట్లు సెబి పేర్కొంది.

ఇలా చేస్తాయి...
- ట్రేడింగ్ కోసం EGRs విభజన, EGRsను బంగారంగా మార్చడం వంటి నిర్ణయాలను సెబీ అనుమతితో ఎక్స్చేంజ్లు తీసుకుంటాయి.
- గోల్డ్ ఎక్స్చేంజీలు నిర్వహించే EGRs ట్రేడింగ్, ఫిజికల్ గోల్డ్ డెలివరీ వంటి ప్రక్రియలతో దేశంలో పసిడికి జాతీయ మార్కెట్ ధర నిర్ణయం కానుంది.
- EGRs అమ్మకాలు, కొనుగోళ్ల కారణంగా సమర్థవంతమైన, పారదర్శకమైన ధరను కనుగొనేందుకు వీలు ఉంటుంది.
- బంగారం పెట్టుబడుల్లో ద్రవ్యత, పుత్తడి నాణ్యతపై హామీ వంటివి ఇన్వెస్టర్లకు లభిస్తాయి.
- ఎక్స్చేంజీల్లో జరిగే EGRs ట్రేడింగ్స్ను క్లియరింగ్ కార్పొరేషన్ సెటిల్ చేస్తుంది. EGRs, నిధులను కొనుగోలు, అమ్మకందారులకు పరస్పరం బదిలీ చేస్తుంది.
- EGRsను ఎంతకాలమైనా అట్టిపెట్టుకోవచ్చు. వీటిని సరెండర్ చేసి, అందుకు సమానమైన బంగారాన్ని వాల్ట్ మేనేజర్స్ నుండి పొందవచ్చు.
- భారత్లో రిజిస్టరైన సంస్థనే వాల్ట్ మేనేజర్గా వ్యవహరించేందుకు అనుమతిస్తారు. ఆ సంస్థ కనీసం రూ.50 కోట్ల నికర వ్యాల్యూతో ఉండాలి.
- EGRsను సృష్టించేందుకు అవసరమైన పసిడిని ఎక్స్చేంజీలు వాల్ట్ మేనేజర్ వద్ద డిపాజిట్ చేస్తాయి. వాల్ట్ నిర్వహణ సంస్థల్ని సెబీ నియంత్రిస్తుంది.
- పసిడిని డిపాజిట్ చేసుకోవడం, స్టోర్ చేయడం, భద్రపర్చడంతో పాటు EGR ఉపసంహరణ వివాదాల పరిష్కారం, వాల్ట్లోని పసిడిని డిపాజిటరీ రికార్డులతో సరిచూసుకోవడం వాల్ట్ మేనేజర్ బాధ్యతలు.

సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ
ఇదిలా ఉండగా, సోషల్ స్టాక్ ఎక్స్ంజీ ఏర్పాటుకు కూడా నిబంధనలు రూపొందించాలని సెబి బోర్డు నిర్ణయించింది. సామాజిక సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఈ ఎక్స్చేంజీని ఉద్దేశించారు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ ఏర్పాటుపై ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో కలిశాక నిర్ణయం ఉంటుంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications