Crorepathi Ideas: మనలో చాలా మంది కోటీశ్వరులుగా మారాలంటే ఇన్వెస్ట్ చేయటానికి సరైన మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ పనికొస్తాయని చాలా మంది భావిస్తుంటారు. వీటిలో ఎస్ఐపీల రూపంలో కాలానుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే తప్పక కోటీశ్వరులుగా మారేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల మార్గంలో వెల్లటం చాలా పనితో కూడుకున్నదిగా నిపుణులు చెబుతున్నారు. ముందుగా సరైన ఫండ్స్ ఎంపిక నుంచి పేమెంట్స్ బౌన్స్ కాకుండా ప్రతినెల సమయానికి ఎస్ఐపీ మెుత్తం చెల్లింపులు, టాక్స్ ఫైలింగ్స్ వంటి అనేక విషయాలు దీనిలో ముడిపడి ఉంటాయని చాలా మందికి ప్రారంభంలో తెలియవు. ఇంత చేసినా మార్కెట్ల ఒడిదొడుకులతో పెట్టుబడులను సమీక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటికి ప్రత్యామ్మాయంగా ఒకేఒక పెట్టుబడి ప్రణాళికను మార్కెట్లలోని పెట్టుబడి నిపుణులు ప్రస్తుతం సూచించటం అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ పద్ధతిలో ఇన్వెస్టర్లు తమ డబ్బును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి డబుల్ అయ్యేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు. అందుకోసం చేయాల్సిందల్లా నేరుగా సెన్సెక్స్ సూచీలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2024లో లక్ష ఇన్వెస్ట్ చేస్తే 2055 నాటికి తప్పక కోటి రూపాయలుగా మారుతుందని వారు పక్కా లెక్కలతో చెబుతున్నారు. ఇందుకోసం ఇండెక్స్ ఈటీఎఫ్ కొనుగోళ్లు ఉత్తమంగా సూచిస్తున్నారు. గడచిన దశాబ్దాలుగా 49 ఏళ్లలో మార్కెట్ల పనితీరును గమనిస్తే ఎన్ని ఒడిదొడుకులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పటికీ సెన్సెక్స్ సగటున 16 శాతం వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని దీనికి ఉదహరిస్తున్నారు.
మీ అవసరాలకు అనగుణంగా 31 ఏళ్లలో పొందాలనుకుంటున్న మెుత్తానికి అనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా సెన్సెక్స్ లో నేరుగా పెట్టుబడిపెట్టడం ఇతర ఈక్విటీల్లో విడివిడిగా పెట్టుబడి కంటే సురక్షితమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. 31 ఏళ్ల తర్వాత కోటి కావాలంటే రూ.లక్ష, 10 కోట్లు కావాలంటే రూ.10 లక్షలు, 100 కోట్లు కావాలంటే రూ.కోటి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో మార్కెట్లు పడిన లేదా కరెక్షన్ కి గురైన ప్రతిసారీ ఇన్వెస్టర్లు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు. పైగా ఇలా నేరుగా పెట్టుబడి పెట్టడం ద్వారా డీమ్యాట్ ఖాతాలో ఉన్న పెట్టుబడులను షూరిటీగా పెట్టి రుణాన్ని వేగంగా పొందటం చాలా సులభతరం. అదే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను తాకట్టు పెట్టి రుణాలు పొందటం కొంత ఆలస్య ప్రక్రియగా నిపుణులు సూచిస్తున్నారు. మెుత్తానికి సెన్సెక్స్ ఈటీఎఫ్ పెట్టుబడులు మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చగలవని నిపుణులు చెబుతున్న మాట.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?



Click it and Unblock the Notifications