2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ ఈ రోజు (మే 11) నుండి ప్రారంభమవుతోంది. ఈసారి గోల్డ్ బాండ్ యూనిట్ ధరను రూ.4,590గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. బాండ్స్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేపట్టే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది.

వీటి ద్వారా కొనుగోలు చేయవచ్చు
డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. బాండ్స్ కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు.

కరోనా-లాక్డౌన్.. ఆదరణ లభించవచ్చు
కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ బాండ్స్ జారీ చేస్తుంది. ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. కరోనా కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బయట బంగారం దుకాణాలు లాక్ డౌన్ కారణంగా తెరిచిలేవు. కాబట్టి గోల్డ్ బాండ్స్కు మంచి ఆదరణ లభిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

2016 నుండి అది రికార్డ్ సబ్స్క్రిప్షన్
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2020-21 సిరీస్ 2 ఇష్యూ ధర గ్రాముకు రూ.4,590గా నిర్ణయించారు. జారీ తేదీ మే 19. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.50 తగ్గింపు లభిస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సిరీస్ 1లో గ్రాముకు రూ.4,639 నిర్ణయించారు. మొదటి సిరీస్లో రూ.822 కోట్ల విలువ కలిగిన 17.73 లక్షల యూనిట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2016 అక్టోబర్ నుండి ఇది రికార్డ్ సబ్స్క్రిప్షన్.

రికార్డ్ యూనిట్లు
2015లో తొలిసారి ప్రారంభించినప్పుడు రూ.245 కోట్ల వ్యాల్యూ కలిగిన 9.14 లక్షల యూనిట్లకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2016 అక్టోబర్లో రూ.1,081 కోట్ల వ్యాల్యూతో 35.98 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అప్పుడు యూనిట్ రూ.3,007గా ఉంది.
More From GoodReturns

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications