ఆర్థిక లావాదేవీల్లో మోసాల కట్టడికి, పన్ను ఎగవేతలను సమర్థవంతంగా గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ని బ్యాంకులు ఉపయోగించడానికి కేంద్రం అనుమతించనున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. వ్యక్తిగత లావాదేవీలు వార్షిక పరిమితిని మించిన సమయంలోనూ.. ధృవీకరణ కోసం బ్యాంకులు ఈ విధానాన్ని వినియోగించనున్నట్లు పేర్కొంది.

డిపాజిట్, విత్డ్రాల ట్రాకింగ్:
ఇప్పటికే కొన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది తప్పనిసరి కానప్పటికీ పాన్ కార్డ్ను బ్యాంకు ఖాతాతో జోడించని వినియోగదారులను ఈ పద్ధతిలో అనుసంధానం చేయనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలు ఇప్పటికే అనుసంధానమైనందున.. ఎక్కువ డిపాజిట్లు, విత్డ్రాలు చేసే వారిని తేలికగా గుర్తించే అవకాశం ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ ద్వారా లభిస్తుంది.

త్వరలో కొత్తం చట్టం:
గోప్యత, సైబర్ భద్రత, ఫేస్ రికగ్నిషన్పై ఇప్పటి వరకు ప్రత్యేక చట్టం లేనందున పలు ఇబ్బందులు తలెత్తవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదనుగుణంగా ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ధృవీకరణ తప్పనిసరి...
కొన్ని సందర్భాల్లో వేలిముద్రల ద్వారా ధృవీకరణ విఫలమవుతున్నందున.. ఆ స్థానంలో ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్లు వినియోగించేందుకు చూడాలని ఇప్పటికే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ బ్యాంకులకు సైతం సూచించింది. ఏదేమైనా ఆధార్ ధృవీకరణ, ప్రామాణీకరణలు వినియోగదారుని అనుమతితో మాత్రమే జరుగుతాయని UIDAI ప్రతినిధి తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications