సిట్టి బాబు సీంపేసాడు..రెండవ రోజు కలెక్షన్ తెలిస్తే అరుపులే?
అనుకున్నట్టుగానే భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ సినిమా రంగస్థలం రికార్డులవైపు జోరుగా పరుగెడుతోంది.విభిన్న పాత్రలో కనిపించి సరికొత్త నటనతో ప్రేక్షకులను మైమరిపించేసాడు మన చిట్టి బాబు.
అనుకున్నట్టుగానే భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ సినిమా రంగస్థలం రికార్డులవైపు జోరుగా పరుగెడుతోంది.విభిన్న పాత్రలో కనిపించి సరికొత్త నటనతో ప్రేక్షకులను మైమరిపించేసాడు మన చిట్టి బాబు.
భారీగా కలెక్షన్లు:
రికార్డులు కనబడేట్టు కాదు వినపడేట్టు రీతిలో రంగస్థలం రెండు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్ల మోత మోగిస్తోంది.ఇది పూర్తిగా పల్లె వాతావణం తో పాటు పాత రోజులు మరియు వారి జీవన శైలి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.
రెండో రోజు:
ఇంక రెండో రోజు కలెక్షన్ల విషయానికొస్తే మన చిట్టి బాబు రంగస్థలం చిత్రం పై అపారమైన ప్రేమ కురిపిస్తున్నారు .విడుదల మొదటిరోజు అక్కడక్కడా కొన్ని నెగటివ్ మాటలు వచ్చిన అవేమి సినిమా మీద ప్రభావం చూపబోగా భారీ కలెక్షన్ల మీదుగా రంగస్థలం దూసుకెళ్తోంది.
రెండు రాష్ట్రాల్లో:
ఈ సినిమా షేర్ల విషయానికొస్తే రంగస్థలం రెండు రాష్ట్రాల్లో రెండవ రోజు మొత్తం రూ.9.5 కోట్లు వాసులు చేసి నాన్ బాహుబలి-2 రికార్డులు నెలకొల్పింది అంటే బాహుబలి వన్ కంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగు ప్రేక్షకులు చిట్టి బాబును ఎంత ఆదరించారో అని,రెండు రోజులకే రంగస్థలం షేర్ రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ.28.5 కోట్లు సాధించింది.
ప్రపంచ స్థాయిలో:
ఇక ప్రపంచ స్థాయిలో కలెక్షన్ల విషయానికొస్తే రంగస్థలం రెండు రోజుల్లో వాసులు చేసిన షేర్లు మొత్తం రూ.43 కోట్ల మార్కును చేరుకుంది.సినిమా కి ప్రపంచ స్థాయిలో జరిగిన థియేట్రికల్ బిజినెస్ రూ.80 కోట్లు రెండు రోజుల్లోనే రూ.43 కోట్లు సాధించిందంటే సుమారు 50 శతం రికవరీ చూసిన్దన్నమాట.
వంద కోట్ల వైపు:
కేవలం రెండు రోజుల్లోనే ఇంత భారీ ఎత్తున కలెక్షన్లు రావడం చూస్తే వరం లోపే రూ.100 కోట్లు దాటేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే 3 వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూస్తే అలానే ఉన్నాయి ఏమాత్రం తగ్గడం లేదు.
రాంచరణ్ పాత్ర:
కుర్ర హీరో గా ముద్ర పడిపోయిన రాంచరణ్ ఎప్పుడు తన సినిమాలో స్టైలిష్ గ కనిపిస్తుంటాడు.కానీ రంగస్థలం సినిమాలో మాత్రం అసలు ఈ పాత్రలో రాంచరణ్ ఎలా ఉంటాడో పాత్ర ఎలా ఉంటుందో అని అందరు ఉత్కంఠభరితంగా ఎదురుచూసారు,ప్రేక్షకుల అంచనాలకు మించి రాంచరణ్ తన పాత్రకు పక్కాగా నయం చేసి అందరిని అలరించారు అందులోను ఈ సినిమా లో మొత్తం రాంచరణ్ ఒక చెవిటి వాడి పాత్ర అందరిని కట్టి పడేసింది.
సరికొత్త సమంత:
అగ్ర కథానాయికగా పేరు పొందిన సమంత కుర్రకారుల గుండెల్లో చోటు సంపాదించింది,ఎం మాయ చేసావే చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి తక్కువ వ్యవధిలోనే అగ్రస్థానం లో నిలిచింది.ఎప్పుడు అధునాతనమైన దుస్తులతో కురాళ్లకు పిచ్చేంకించే సమంత ఇందులో పక్క పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఇమిడిపోయింది.ఈ పాత్రలో తనకు తానే సతి అని మరో సరి నిరూపించింది సమంత.
సుకుమార్ సెన్సేషన్:
ఈ చిత్రానికి సుకుమార్ చేరిన కృషి అమోగం,అసలు ఎప్పుడు ఉన్న జనరేషన్ కి ఎలాంటి సినిమాలు కూడా నచ్చుతాయి అని నిరూపించారు,మొత్తం చిత్రం పల్లె వాతావరణంలోనే చిత్రీకరించారు,ఇందులో ముక్యంగా చెప్పుకోవాల్సింది పాత్రలు ప్రతి ఒక్కరి పాత్రలు చాల అద్భుతం.పల్లెటూరులో నాగరికత మరియు ప్రెసిడెంటు పాత్ర ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు.