ఎట్టకేలకు పీఎస్బీ కేసులో విజయ్ మాల్యాకు ఊరట
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్కి గ్యారంటర్ యునైటెడ్ బ్రూవరీస్ హోలింగ్స్ లిమిటెడ్, ఆయా సంస్దల యజమాని విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులుగా ప్రకటిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎస్బీ) ఇచ్చిన నోటీసును ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకి ఊరట లభించింది.
దీంతోపాటు కోల్ కత్తా హైకోర్టు యునైటెడ్ బ్యాంక్ కేసులో యుబిహెచ్ ఎల్ ప్రతినిధులు విచారణకు హాజరు కావడానికి అంగీకరించాలన్న అభ్యర్దనను తోసి పుచ్చింది. యుబిహెచఎల్కు అంతక మందు పిఎస్బీ ఒక నోటీసు జారీ చేస్తూ ఈ నోటీసు ఇచ్చిన తేదీ 21 నుండి ఏడు రోజుల్లోగా తమ ముందు హాజరు కాకపోతే వారిని ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులుగా ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చిరించింది.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తమ బ్యాంకు నుండి తీసుకున్న 770 కోట్ల రూపాయిల రుణాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆరోపించింది. గతంలో తీసుకున్న బకాయికి అసలు వడ్డీ కలిపి సుమారు రూ. 800 కోట్లు దాటిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టుకి తెలియజేసింది.