కో పైలెట్ పిటిషన్, విజయ్ మాల్యాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యాతో పాటు ఆ కంపెనీ వైస్ ఛైర్మన్ రూపీ ఆర్యకు ఉత్తర ప్రదేశ్లోని బులంద్ షహర్ న్యాయస్దానం సమన్లు జారీ చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్ద తనకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదంటూ ఆకాష్ శర్మ అనే కో పైలెట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6వ తారీఖున విజయ మాల్యాను కోర్టులో హాజరుపరచాలని బెంగుళూరు సూపరింటిండెంట్ను ఆదేశించింది.
తాను 2006లో డెక్కన్ ఏవియేషన్ సంస్దలో కో పైలట్గా చేరానని, ఆ తర్వాతి కాలంలో ఆ సంస్దను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ టేకోవర్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తన కార్యకలాపాలు నిలిచిపోగా, తనకు రూ. 28.50 లక్షలు రావాల్సి ఉందని ఆకాష్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నాడు.