ఇన్పోసిస్ ఉన్నతోద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి
హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్సోసిస్ ఉన్నత అధికారులు వేతనాలు ఒకేసారి మూడు నుంచి ఐదు రేట్లు మేరకు పెరిగాయి. రూ. 30 కోట్ల వార్షిక వేతనంతో కంపెనీ సీఈఓ విశాల్ శిఖా, దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓగా కొనసాగుతున్నారు.
ఐతే, ఇన్పోసిస్ సంస్దలో ఆయన తర్వాత స్దానాల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ హోదా ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో ఇన్ఫోసిస్ తాజాగా ఉన్నత ఉద్యోగుల వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టింది.
గతంలో 1.2 నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకునే వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు ఇక నుంచి రూ. 6 కోట్ల వరకు వేతనాన్ని తీసుకోనున్నారు. తాజాగా పెంచిన వేతనాలతో సంస్థలో పలువురు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఒకేసారి భారీ పెరుగుదల నమోదైంది.
భారత్ లోకి పెద్ద సంఖ్యలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ప్రవేశిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు తమ నాణ్యమైన సిబ్బందిని నిలుపుకునేందుకు ఇలాంటి సాహసాలు చేయక తప్పదని మార్కెట్ విశ్లేషణకులు భావిస్తున్నారు.