జూన్ నుంచి అటల్ పెన్షన్ యోజన... ప్రత్యేకలు
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5,000 వరకు ఫించను అందుకునే అవకాశం ఉంటుంది.
ఫించను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్ధ పరిధిలో నడిచే జాతీయ ఫించను పథకం కింద పెన్షన్ పొందుతున్న వారితో పాటు ఇతరత్రా చట్టబద్ధ సమాజిక భద్రత పథకాల్లో సభ్యులు కానివారందరి పైనా ఈ పథకం దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
ఈ పథకానికి అర్హులు కావడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ట వయసు 40 ఏళ్లు. లభ్దిదారులు కనీసం 20 సంవత్సరాలు ఏపీవై పథకంలో కొనసాగాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన వంతుగా ఏడాదికి లబ్ధిదారులు కట్టిన మొత్తంలో 50 శాతం లేదా రూ. 1000(వీటిలో ఏది తక్కువైతే అది) ఐదేళ్ల పాటు జమ చేస్తుంది.
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. ఈ పథకంలో కట్టే ప్రీమియాన్ని బట్టి రిస్క్ కవర్ రూ. 2 లక్షలు వరకు ఉంటుంది. పథకం పూర్తైన తర్వాత కూడా కావాలనుకుంటే 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.
వీటితో పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. వార్షిక ప్రీమియం రూ. 12. ఈ పథకం కింద ప్రమాదాల్లో మరణించినా, పూర్తి అంగవైకల్యం పొందినా లబ్ధిదారులకు రూ. 2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ. లక్ష పరిహారం అందుతుంది.
అటల్ పెన్షన్ యోజన పథకం కింద ప్రీమియం లెక్కించడం ఎలా?
ప్రస్తుతం స్వావలంబన్ పథకం కింద ఫించను ప్రయోజనాన్ని పొందుతున్న వారంతా ఈ స్కీములోకి మారాల్సి ఉంది. ఏపీవై పథకం కింద నెలకు కనీసం రూ. 1000 నుంచి రూ. 5000 వరకు ఫించను వస్తుంది.
Age on contributing to the Yojana | Years an Individual Has Contributed | Rough Calculation of Monthly Contribution (in Rs) | Monthly Pension That A Subscriber Receives (in Rs) | Return To The Family (in Rs ) |
18 | 42 | 210 | 5000 | 8.5 lakhs |
20 | 40 | 248 | 5000 | 8.5 lakhs |
25 | 35 | 376 | 5000 |
8.5
lakhs |
30 | 30 | 577 | 5000 | 8.5 lakhs |
35 | 25 | 902 | 5000 | 8.5 lakhs |
40 | 20 | 1454 | 5000 | 8.5 lakhs |