బ్యాంకింగ్ సంస్థలు సాంకేతిక రంగంలో అప్రమత్తంగా ఉండాలి... సైబర్ దాడుల్లో 22% బ్యాంకింగ్ పైనే
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బ్యాంకులపైనే దృష్టి పెడతారు జాగ్రత్తగా ఉండాలంటూ జాతీయ సైబర్ సెక్యూరిటి కో - ఆర్డీనేటర్ గుల్జన్ రాయ్ హెచ్చరించారు..ఈ నేపథ్యంలోనే బ్యాంకులు తమ సాఫ్ట్ వేర్ వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాలని అవసరం ఉందని అయన బ్యాంకర్స్ కు సూచించారు...ఇండియన్ బ్యాంక్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన బ్యాంకింగ్ టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు...
ఆధునిక టెక్నాలజీ వినియోగం తోపాటు సైబర్ భద్రత విషయంలో ఎదురయ్యే సవాళ్లు,ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన చెప్పారు..ఈనేపథ్యంలోనే ఐదో తరం టెక్నాలజీతో మరింత సంక్లీష్టంగా మారిందన్నారు..అత్యధికంగా సైబర్ దాడులు బ్యాంకింగ్ లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయని తెలిపారు...కాగ గత ఏడాది దేశంలో వెలుగు చూసిన సైబర్ దాడుల్లో 22 శాతం బ్యాంకింగ్ రంగంపై జరిగినవని అన్నారు...ఇక కంపనీల సీఈవోలు సైతం టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలని అవశ్యకత ఏర్పడిందని సూచించారు...