ఇకపై సిమ్ కార్డు కొనాలంటే ఆధార్ కి బదులుగా ఇది తప్పనిసరా...
ఆధార్ ఆధారిత ధృవీకరణకు ప్రత్యామ్నాయంగా కొత్త ఇ-కెవైసి ప్రక్రియ కోసం టెలికాం ఆపరేటర్లు అనుమతిని కోరుతూ టెలికాం విభాగం (DOT) ను సంప్రదించారు.
ఆధార్ ఆధారిత ధృవీకరణకు ప్రత్యామ్నాయంగా కొత్త ఇ-కెవైసి ప్రక్రియ కోసం టెలికాం ఆపరేటర్లు అనుమతిని కోరుతూ టెలికాం విభాగం (DOT) ను సంప్రదించారు.
మార్పుల ప్రతిపాదన:
తాము DoT ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు చిన్న మార్పులను ప్రతిపాదించామని కస్టమర్ అప్లికేషన్ ఫారం (CAF)తో పాటు ఛాయాచిత్రాన్ని మరియు స్కాన్ చేసిన చిత్రాలతో పొందుపరచడానికి ఇది అనుమతిస్తుంది అని తద్వారా పూర్తిగా నూతనంగా కొత్త చందాదారుల బోర్డింగ్లో ప్రక్రియను పేపర్ లేకుండా ముగించడానికి డిజిటైజ్ చేస్తుంది అని అపెక్స్ భారతదేశంలో టెలికాం సలహా మండలి (ACT) DoT కు ఒక లేఖలో తెలిపింది.
కాగితం ఆధారిత విధానాలకు
కాగితం ఆధారిత విధానాలకు తిరిగి రావడం అనేది ఒక డిజిటల్ ఇండియా వైపు పరిశ్రమ తీసుకుంటున్న చర్యలను వెనక్కు నెడుతుంది మరియు ఇప్పటికే ఉన్న పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల క్షీణతకు దారి తీస్తుంది అని అక్టోబరు 5 న వ్రాసిన లేఖలో చెప్పింది.
సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందు, ఆధార్ ను ఉపయోగించి వినియోగదారుల తక్షణ ఆన్లైన్ ధృవీకరణ కోసం టెలికాం ఆపరేటర్లు ఒక వ్యవస్థను అభివృద్ధి చేశారని, ఇది త్వరితగతిన తక్కువ ఖర్చుతో సేవలను వేగవంతం చేసింది అన్నారు.
కస్టమరు ఫోటోను
సిమ్ కార్డు విక్రయించే వ్యక్తే కస్టమరు ఫోటోను మొబైల్ ద్వారా తీసుకుని, సంబంధిత పత్రాలను జతచేసే విధంగా నూతన టెక్నాలజీ ఉండనుందని తెలిపింది. ఇందుకు అనుగుణంగా డాట్ మార్గదర్శకాలలో పలు మార్పులు అవసరమని లేఖలో పేర్కొంది. .
OTP
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ సంతకం చేసిన లేఖలో వినియోగదారు దరఖాస్తును యాప్ ద్వారా డిజిటలైజ్ చేసిన తర్వాత, విక్రయదారుడు వన్ టైం పాస్ వర్డ్ (OTP) అందుకుంటాడు మరియు అలాగే కస్టమర్ కూడా తన ప్రత్యామ్నాయ సంఖ్యలో OTP ను పొందుతాడు.
కస్టమర్ సంతకం
విజయవంతమైన OTP ధ్రువీకరణపై OTP ని ఎంటర్ చేసి, ధ్రువీకరించబడుతుంది, ఇది కస్టమర్ సంతకంగా పరిగణించబడుతుంది అని లేఖ పేర్కొంది.