గురువారం మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.
గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 82.36 రూపాయలకు చేరుకుంది.
గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 82.36 రూపాయలకు చేరుకుంది. ముంబయిలో పెట్రోలు లీటరు రూ.87.82 రూపాయల వద్ద రిటైలింగ్ అయింది. మంగళవారం నాటి నుంచి 9 పైసలు పెంచింది. చెన్నైలో పెట్రోలు ప్రస్తుతం రూ.85.61 రూపాయలకు విక్రయించబడుతున్నాయి. కోల్కతా విషయానికి వస్తే పెట్రోల్ ధర రూ.84.19 రూపాయలకు పెరిగింది.
సవరించిన రేట్లు ఈ ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 2.50 రూపాయల మేరకు తగ్గించాలని మేఘాలయ మంత్రివర్గం ప్రతిపాదించింది. సంవత్సరానికి రూ. 15 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్టోబరు 11 నుంచి లీటరు పెట్రోలు, డీజిల్పై లీటరుకు 2.50 రూపాయల చొప్పున రిబేటును ప్రవేశపెడతామని మంత్రివర్గం భావిస్తున్నారు 'అని డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రెస్టోన్ తన్సోంగ్ చెప్పారు.
ముంబైలో పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలో పెరిగి రూ.91.34 కి చేరిన తర్వాత నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల రూపాయల రూ.2.50 టాక్స్ తగ్గింపును ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇది వర్తించింది. ప్రకటన తరువాత ప్రధాన మెట్రోలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రూ .5 రూపాయల వరకు తగ్గాయి, సామాన్య ప్రజలకు అది ఉపశమనం కలిగించింది.
పెరుగుతున్న ఇంధన ధరలపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలను మోసం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. "మోడీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై ప్రజలను నిరంతరం దోచుకుంటోంది. ప్రజల జేబులను దోచుకోవడం బిజెపి ప్రాథమిక విధి అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ఈ వారంలో ట్విట్టర్లో చెప్పారు.