ఇది దయా గాని దండయాత్ర అంటున్న పెట్రోల్ ధరలు.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ వంటి సున్నితమైన ఉత్పత్తుల ధరలను ఆదివారం నాడు పెంచాయి.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ వంటి సున్నితమైన ఉత్పత్తుల ధరలను ఆదివారం నాడు పెంచాయి.
తారా స్థాయికి
పెట్రోల్, డీజిల్ ఆదివారం తారా స్థాయికి చేరాయి అలాగే నాలుగు మెట్రోలలో చూస్తే ముంబైలో గరిష్ఠంగా ధరలు ఉన్నాయి. లీటరు పెట్రోల్ ధరలు 87.89 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటర్ ₹ 77.09 వద్ద ఉంది.ఢిల్లీలో పెట్రోలు ధర రికార్డు స్థాయిలో 80.50 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటర్ ₹ 72.61 కు పెరిగి రికార్డు స్థాయిలోనే ఉంది, అయితే నాలుగు మెట్రోలలో చూస్తే ఇక్కడ ధర అత్యల్పంగా ఉంది.
ఢిల్లీలో పెట్రోల్ ధర
సోమవారం నాడు ఢిల్లీలో పెట్రోల్ ధర ఎక్సైజ్ డ్యూటీ తో సహా రూ. 19.48 రూపాయలు, డీలర్ కమిషన్ రూ. 3.63 మరియు వ్యాట్ 16.83 (డీలర్ కమిషన్ పై వ్యాట్ తో సహా).అదేవిధంగా సోమవారం డీజిల్లో డీజిల్ ధరల పెంపు ఎక్సైజ్ డ్యూటీ తో సహా రూ.15.33, డీలర్ కమిషన్ రూ.2.51 అలాగే వ్యాట్ 10.46 (డీలర్ కమిషన్ పై వ్యాట్ తో సహా).
కోల్కతాలో లీటరు పెట్రోలు ధర
కోల్కతాలో లీటరు పెట్రోలు ధర రూ.83.39 కు చేరింది, డీజిల్ ధర లీటరు రూ .75.46 కు చేరింది. అదేవిధంగా చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.83.66 రూపాయలకు, డీజిల్ రిటైల్ ధర రూ. 76.75 రూపాయలకు విక్రయించబడుతోంది.
భారత రూపాయి
భారతదేశం దాని ముడి చమురులో 80 శాతం దిగుమతి చేస్తుంది పడిపోతున్న భారత రూపాయి దిగుమతులపై ప్రభావం చూపుతోంది మరియు ఇంధన ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
చమురు సంస్థలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు సంస్థలు గత జూన్ నెలలో మొదటి మరియు 16 వ తేదీలలో సవరించిన 15 సంవత్సరాల ఆచరణను తిరస్కరించాయి.పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ డేటా ప్రకారం, ఏప్రిల్ మరియు జూలై 2018 మధ్య భారతదేశం ముడి చమురు విలువ 2,640,30 కోట్ల రూపాయలు (39 బిలియన్ డాలర్లు) దిగుమతి చేసుకుంది.