భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారుల నడ్డి విరుగుతోంది.
దేశ రాజధాని లో పెట్రోలు ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటి మరో సారి రికార్డు స్థాయికి చేరింది . ఢిల్లీలో పెట్రోలు,ధర లీటరుకు రూ .80.38 మరియు డీజిల్ రూ.72.51 రూపాయలు గా ఉన్నాయి
దేశ రాజధాని లో పెట్రోలు ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటి మరో సారి రికార్డు స్థాయికి చేరింది . ఢిల్లీలో పెట్రోలు,ధర లీటరుకు రూ .80.38 మరియు డీజిల్ రూ.72.51 రూపాయలు గా ఉన్నాయి.లీటరు పెట్రోలు ధర రూ.79.99 నుండి 39 పైసలు పెరిగి రూ .80.38 కి చేరింది ,డీజిల్ పై ధర 44 పైసలు పెరిగి 72.07 రూపాయల మేర పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తెలిపింది.
ముడి చమురు:
పెట్రోలు ముంబైలో లీటరుకు రూ .87.77 వద్ద విక్రయించగా, డీజిల్ లీటరుకు 76.98 రూపాయలుగా ఉంది.ఇంధన ధరలు ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారణం ముడి చమురు ధరలు పెరగడం మరియు దేశంలో ఎక్సైజ్ పన్ను పెరగడం వంటి కారణాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే రూపాయి:
అలాగే రూపాయిలో ఇటీవలి తరుగుదలతో ముడి చమురు దిగుమతి ధరను కూడా అమాంతరంగా పెంచేసింది,ఇది తరువాత ఇంధన ధరలను ప్రభావితం చేసింది.
దేశీయ ఇంధన ధరలు ఈ ఏడాదిలో ఇదే అత్యధికంగా 50 పైసలు పెరగడం.ఈ పెరిగిన ధరలు నాలుగు మెట్రో నగరాల్లో అమల్లోకి వచ్చాయి.
అధిక ఇంధన ధరలు:
ముడి చమురు ధరలు పెరగడం, డాలర్కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గుదల కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుతూనే ఉంది. భారతీయ రూపాయి బలహీనపడటం ముడి చమురు దిగుమతిని ఖరీదు చేస్తుంది.దేశీయ కారకాల నేపథ్యంలో, దేశంలో అధిక ఎక్సైజ్ సుంకం విధించడం కూడా అధిక ఇంధన ధరలకు ప్రధాన కారణం అని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ ఉత్పత్తుల పై:
డీజిల్ ధరల పెరుగుదల ఆందోళనను ఆకర్షిస్తుంది, ఇంధన వినియోగంతో సహా వస్తువుల రవాణాలో ఉపయోగించే వ్యవసాయ ఉత్పత్తుల పై కూడా ప్రభావం చూపింది,ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దరి తీసే అవకాశం ఉందంటున్నారు.