For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్యామిట్ మళ్ళీ అదే సీన్ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ హోల్డర్స్ ఆశలు ఢమాల్

By Sabari
|

క్రితం సెష‌న్ లాగే నేడు కూడా చివర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 155 పాయింట్లు క్షీణించి 38,158కు చేరగా నిఫ్టీ 62 పాయింట్లు పతనమై 11,520 వద్ద నిలిచింది. చైనా, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు, అర్జెంటీనా సంక్షోభం, రూపాయి పతనం వంటి అంశాలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయడంతో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇవే అంశాల కారణంగా సోమవారం చివర్లో అనూహ్యంగా తలెత్తిన భారీ అమ్మకాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోపక్క యూరప్‌, ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు అమ్మకాలతో తిరోగమించాయి. సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవుకాగా నేడు ట్రేడింగ్‌ ప్రారంభం కానుంది.

డ్యామిట్ మళ్ళీ అదే సీన్ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ హోల్డర్స్ ఆశలు ఢమాల్

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఇన్ఫీ(2.64%), టీసీఎస్‌(1.86%), విప్రో(1.42%), యాక్సిస్ బ్యాంక్(0.97%), రిల‌య‌న్స్(0.97%) లాభాల్లో ఉండ‌గా, మ‌రో వైపు ఏసియ‌న్ పెయింట్స్(3.49%), ఎస్‌బీఐఎన్(3.20%), అదానీ పోర్ట్స్(2.95%), హెచ్‌యూఎల్(2.80%), కోల్ ఇండియా(2.61%), ఇండ‌స్ఇండ్ బ్యాంక్(2.36%) న‌ష్ట‌పోయాయి

Read more about: stock market
English summary

డ్యామిట్ మళ్ళీ అదే సీన్ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ హోల్డర్స్ ఆశలు ఢమాల్ | Stock Market Ends with Lose Today

Like the sessions of the previous year, The Sensex ended 155 points lower at 38,158 and the Nifty closed 62 points lower at 11,520.
Story first published: Tuesday, September 4, 2018, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X