ఎస్బిఐ ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు సవరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) గృహాల మరమ్మత్తు మరియు పునర్నిర్మాణం కోసం కేరళ వరద నివాసితుల రుణాలపై ప్రత్యేక వడ్డీ రేటు ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) గృహాల మరమ్మత్తు మరియు పునర్నిర్మాణం కోసం కేరళ వరద నివాసితుల రుణాలపై ప్రత్యేక వడ్డీ రేటు ప్రకటించింది.
గత నెలలో అనుకోని విపత్తుకు కేరళ రాష్ట్రము మొత్తం జలమయమైన విషయం విదితమే.లక్షలాది మంది ప్రజలు తమ నివాసులు కోల్పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్నారు.వరదలు తగ్గాక తమ సొంత నివాసాలకు వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే వరదలతో చాల ఇల్లు దెబ్బతిన్నాయి మరమ్మతులు చేయందే ఇంట్లో నివసించే పరిస్థితి లేదు.
ఈ పథకం కింద ఎస్బిఐ 10 లక్షల రూపాయల వరకు రుణాలు, సంవత్సరానికి 8.45 శాతం వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ రుసుము మినహాయింపుతో పాటు అందిస్తుంది. ఈ ప్యాత్యేక రేట్లు నిర్వసితులు తమ గృహాలకు మరమ్మతులు లేక పునఃనిర్మాణం కోసం వర్తిస్తుందని మరియు నవంబర్ 30 లోగ దరఖాస్తు చేసుకోవాలి అని ఎస్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది ఎటువంటి వ్యాప్తి లేకుండా 8.45 శాతం ఇవ్వబడుతుంది మరియు ఈ పొదుపు వ్యాప్తి ఆదా 25-75 బేసిస్ పాయింట్ల మధ్య ఉంటుంది అని ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు.
సెప్టెంబరు నుంచి ఎస్బిఐ MCLR (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ ) ను 8.45 శాతానికి పెంచింది, దీనికి అదనంగా 25-75 బేసిస్ స్ప్రెడ్ను రుణాల్లో రిస్కును దృష్టిలో ఉంచుకొని జోడించబడింది.