ఈ ఘనుడు రూ.25 లక్షలకు స్కెచ్ వేసాడు కానీ చివరికి... చూడండి మీరే!
ఒక బిజినెస్ మ్యాన్ వద్ద భారీ మొత్తం దోచుకొని లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు ఒక వ్యక్తి. అనుకున్నదే ఆలస్యంగా తన పధకాన్ని అమలుపెట్టాడు. ఈ పధకానికి తనకి నలుగురు వ్యక్తులు అవసరపడ్డారు.
బిజినెస్ మ్యాన్
మొత్తానికి నలుగురిని తన టీంలోకి జాయిన్ చేసుకున్నాడు. ఇక ఈ నలుగురు కలిసి ఆ బిజినెస్ మ్యాన్ ఇంటి వద్ద మరియు బిజినెస్ మ్యాన్ రోజు దినచర్య మీద రెక్కీ వేశారు.
ప్రణాళిక
ఒక రోజు ఆ వ్యాపారవేత్త బ్యాగ్ నిండా డబ్బు ఉంది అని గ్రహించి ఆ బ్యాగ్లో సుమారు రూ.25 లక్షప్రణాళికలు ఉంది అని అనుకున్నారు. తలో రూ.5 లక్షల రూపాయిలు పంచుకుంటే జీవితాలు సెటిల్ అని అనుకున్నారు. అనుకున్నట్లే తమ ఆచరణలో పెట్టి బ్యాగ్ తో ఉడాయించారు.
పెద్ద షాక్
ఆ బ్యాగ్ కొట్టిసిన తర్వాత ఆ ఐదుగురికి ఒక పెద్ద షాక్ తగ్గిలింది ఇంతకీ ఆ బ్యాగులో ఏముందో తెలుసా?ఆ బ్యాగ్లో ఒక రూ.5 నాణ్యం ఉంది. ఇంకేముంది దొరికింది మొత్తం రూ.5 రూపాయిలు ఇక చోరీకి పాల్పడింది వాళ్లే అని తెలిసి జైలులో చిప్ప కుడు తింటున్నారు.
ఢిల్లీలో
ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి దుస్తుల ఫ్యాక్టరీ ఉంది . ఖాలిద్ అనే వ్యక్తి ఆ వ్యాపారిని రెగ్యులర్ కస్టమర్. తరచూ వ్యాపారానికి వచ్చే ఖాలిద్ ఆ వ్యాపారి దగ్గర భారీ మొత్తంలో డబ్బు మరియు నగదు ఉండడం గమనించాడు.
బ్యాగ్ తెరిచి
రోజు వ్యాపారి ఇంటి తిరిగి వెళ్ళేటప్పుడు వ్యాపారి బ్యాగ్ నిండుగా ఉండేది. ఇది చూసిన ఖాలిద్ కి దురాలోచన పుట్టింది . మరో నలుగురు వ్యక్తులతో కలిసి చోరీకి పధకం వేసి వ్యాపారి దగ్గర బ్యాగ్ కొట్టేసారు. తీరా ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరిచి చూస్తే రూ.5 నాణ్యం కనిపించింది.బ్యాగ్లో విలువైన పత్రాలు ఉన్నాయి అని వ్యాపారి చెప్పిన వీరు వినలేదు. ఆఖరికి వ్యాపారి స్కూటర్ సీట్ కింద డబ్బులు ఉంటాయి అని అనుకున్నారు కానీ బొక్క బోర్లా పడ్డారు.
వ్యాపారి
చివరికి వ్యాపారి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుట్ ఏజ్ ఆధారంగా నిందితులని పట్టుకున్నారు. కూపీ లాగగా వ్యాపారి దగ్గరికి వచ్చే కస్టమర్ దొంగ అని తేలింది.
బ్యాగ్ నిండుగా
తాను ఎప్పుడు నగదు బ్యాగులో తీసుకువెళ్లను అని బ్యాగ్లో లంచ్ బాక్స్ మరియు వ్యాపారానికి సంబంధించి కొన్ని పత్రాలు ఉంటాయి అని అందుకే బ్యాగ్ నిండుగా కనిపిస్తుంది అని వ్యాపారి పోలీసులకి చెప్పాడు.
వ్యాపారి జేబీలో
ఖాలిద్ కు దొంగతనం అనుభవం లేకపోవడంతో ఇలా అడ్డంగా బుక్ అయ్యాడు. మిగతా నలుగురు గతంలో కూడా కొన్ని చోరీలు చేసినట్లు అనుమానిస్తున్నారు. అదే నిజం అయితే వారికి భారీ మూల్యం తప్పదు. మరో ఆశ్యర్యకర విషయం ఏమిటి అంటే చోరీ జరిగే సమయంలో వ్యాపారి జేబీలో రూ.10000 ఉన్నాయి అని వ్యాపారి పోలీసులతో చెప్పాడు.