జెట్ ఎయిర్వేస్ త్వరలో28 కొత్త విమానాలు ప్రారంభం.
జెట్ ఎయిర్వేస్ త్వరలో 28 కొత్త విమానాలు ప్రారంభం చేస్తునట్టు ప్రకటించింది, రోజువారీ సేవలు తో పాటు ఇండోర్ నుండి జోధ్పూర్ మరియు వడోదర కు వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు.
జెట్ ఎయిర్వేస్ త్వరలో 28 కొత్త విమానాలు ప్రారంభం చేస్తునట్టు ప్రకటించింది, రోజువారీ సేవలు తో పాటు ఇండోర్ నుండి జోధ్పూర్ మరియు వడోదర కు వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు.సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ చండీగఢ్, లక్నో, అహ్మదాబాద్, జోధ్పూర్, వడోదర, జైపూర్ల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది.
రానున్న నెలలో 28 కొత్త విమానాలను ప్రవేశపెట్టనున్నట్టు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని జెట్ ఎయిర్వేస్ తెలిపింది.
ఈ విమానాలు జోధ్పూర్ మరియు వడోదరాతో ఇండోర్ను కలిపే తొమ్మిది మార్గాలు కలుపుతుంది. బెంగళూరు-లక్నో, ఇండోర్-కోల్కతా, కోల్కతా-చండీగఢ్, కోయంబత్తూర్-హైదరాబాద్ ల మధ్య నాన్స్టాప్ విమానాలు ప్రారంభించనున్నాయి.
ఇండోర్-వడోదరా, ఇండోర్-జోధ్పూర్ లాంటి కొత్త సర్వీసులు ప్రయాణ మరియు ప్రోత్సాహక వ్యాపార కార్యకలాపాలు ప్రోత్సహిస్థాయి, ముఖ్యంగా వడోదరా మరియు జోధ్పూర్ పరిసరాలలో ఉన్న చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు మంచి సానుకూలత లభిస్తుందని జెట్ ఎయిర్వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వరల్డ్ వైడ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్) రాజ్ శివకుమార్ అన్నారు.
ఇది SME లకు మరియు రోజువారీ విమాన ప్రయాణాలను ఆస్వాదించే కార్పరేట్ ప్రయాణీకులకు కూడా లాభదాయకమవుతుంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం, ఈ ఎయిర్లైన్స్ 121 విమానాలను కలిగి ఉంది.