బంపర్ ఆఫర్ గజం స్థలం కేవలం రూ.100 ఎక్కడో తెలుసా? ఎందుకో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకొంది.రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం గజం భూమిని కేవలం రూ.100 ఇవ్వడానికి ముందుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
మంత్రివర్గం
రాష్ట్ర, జిల్లా మరియు కేంద్ర గుర్తింపు పొందిన పార్టీలకు కార్యాలయాలు నిర్మించుకోడానికి అతితక్కువ ధరలకే భూములు కేటాయించాలి అని ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ సర్కార్
దీనిపై విధివిధానాలు రూపొందిస్తున్న తెలంగాణ సర్కార్ త్వరలోనే అన్ని పార్టీలకి లేఖలు రాయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే టిఅర్ఎస్ కార్యాలయాలకు ఎకరానికి మించకుండా 28 చోట్ల స్థలాన్ని కేటాయించాలి అని మంత్రి వర్గం నిర్ణయం తీసుకొంది.
భూములు
ఇప్పటికే అన్ని పార్టీలకు భూములు ఇవ్వాలి అని నిర్ణయించింది ఇప్పటి వరకు పార్టీలు అన్ని ట్రస్ట్ పేరిట భూములు తీసుకోని పార్టీ కార్యాలయాలు నిర్మించుకోనున్నాయి.
అన్ని పార్టీలు
కానీ తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న ఈ విధానంతో అన్ని పార్టీలు దర్జాగా జిల్లా కేంద్రాలయాలతో పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయాలు నిర్మించుకోడానికి ప్రభుత్వం భూములు ఇస్తోంది.
రూ.100 కి గజం
అది కూడా కేవలం రూ.100 కి గజం భూమి ఇచ్చేయేందుకు వీలుగా నూతన విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ పాలసీ సంబంధించిన ప్రాజెక్ట్ కు లేఖలు రాయనుంది తెలంగాణ ప్రభుత్వం.