తెలంగాణ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ ఇంటింటికి వంట గ్యాస్
రాష్ట్రంలో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్ట్ సొంతం చేసుకొంది మేఘ ఇంజనీరింగ్ సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 25 జిల్లాలో 5 .5 లక్షల గృహాలకు వంట గ్యాస్ సరఫరా చేయనున్నారు.
వందన శర్మ
ఈ విషయాన్ని పెట్రోలియుమ్ సహజ వాయువు నియంత్రణ మండలి PNGRB కార్యదర్శి వందన శర్మ మేఘ ఇంజినీరింగ్ కు రాసిన లేకలో తెలిపారు
తెలంగాణలో
గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంట గ్యాస్ అందించాలి అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఇటీవలే నిర్మించిన బీడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను MEIL దక్కించుకొంది అని MEIL అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి తెలిపారు.
వరంగల్
అయితే PNGRB ఇప్పటి వరకు తెరచిన బీడ్లలో వరంగల్ అర్బన్ , వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి , మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి, కొత్తగూడం , ఖమ్మం జిల్లా , నల్లగొండ, సూర్యపేట , యాదాద్రి , భువనగిరి, జిల్లాలను దక్కిచుకోగా మరిన్ని తెలియాల్సిఉంది .
1500 కిలోమీటర్ల
వరంగల్ అర్బన్ , వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి , మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 800 ఇంచ్ కిలో మీటర్లు నల్లగొండ, సూర్యపేట , యాదాద్రి , భువనగిరి, జిల్లాలో 1500 ఇంచ్ కిలోమీటర్ల పైప్ లైన్ వేయనుంది.
ట్రంక్ లైన్ నెట్ వర్క్
మొత్తం పది జిల్లాలో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తం గ్యాస్ సరఫరా చేయనుంది. ట్రంక్ లైన్ నెట్ వర్క్ ద్వారా ఈ గ్యాస్ తీసుకోనున్నారు.
2020 నాటికీ
మరో వైపు 2020 నాటికీ దేశవ్యాప్తంగా ఒక కోటి గ్యాస్ కనెక్షన్లు ఇంటింటికి చేరాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది .