అప్పట్లో సైకిళ్లకు పంచర్లు.. ఇప్పుడు రూ.150 కోట్ల ఆస్తులు.కానీ చివరికి.. ఏమైందో మీరే చదవండి.
రద్దీ రోడ్డు ఒక పక్కన చిన్న షాపు ఇక్కడ సైకిలు అద్దెకి ఇవ్వబడును , సైకిల్ పంచారు వేయబడును మరియు గంట సైకిల్ అద్దె రూ.5 సైకిల్ పంచారు వేస్తే రూ.10 . వానకొచ్చిన, వరదొచ్చినా షాపు కూలిపోతుంది.
కష్టపడితే
ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది రోజుకి రూ.250 మాత్రమే ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? 10 ఏళ్ల క్రిత్రం కంది శెట్టి రమేష్ జీవితం ఇది కానీ ఇప్పుడు రూ.150 కోట్ల అధిపతి.
రాజకీయ నాయకులు
ఇప్పుడు ఇతను ఒక బడా బిజినెస్ మ్యాన్ ఇతని దగ్గర ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అప్పులు చేస్తుంటారు. 2014 ఎన్నికలలో పోటీ చేసిన ఐదుగురు రాజకీయ నాయకులకు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు.
కందిశెట్టి రమేష్
పది ఏళ్లలో రూ.150 కోట్లు సంపాధించిన కందిశెట్టి రమేష్ ఐడియాల పై ఎవరికీ డౌట్ లేకపోయినా అయన ఆదాయ పన్ను ఏగొట్టడంతో అసలు సమస్య వచ్చింది. అసలు ఎవరి కందిశెట్టి రమేష్ ఎక్కడ అతను ఈయన తెలుసుకుందాం.
తిరుపతిలో
ఈయన తిరుపతిలోని పల్లి వీధిలో పూలతోటలో కందిశెట్టి రమేష్ నివాసం ఈయన 10 ఏళ్ల క్రితం పంచారు షాప్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడ అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి.
చిట్స్ ఆఫీస్
నమ్మకస్థుడు అని పేరు రావడంతో చీటిల వ్యాపారం మొదలు పెట్టాడు టైం టూ టైం చెల్లింపులు ఉండేవి. ప్రజలలో ఈయన పై నమ్మకం మరింత పెరిగింది. ఇదే సమయంలో వచ్చిన డబ్బును వడ్డీకి ఇచ్చేవాడు. సైకిల్ షాప్ పోయి చిట్స్ ఆఫీస్ వచ్చింది.
లక్షలు దాటి కోట్లకి
ఈ చిట్స్ ఆఫీసులో సామాన్యులు నుంచి సంపన్నుల వరకు చిట్స్ వేయడం మొదలు పెట్టారు. వడ్డీకి వచ్చే అప్పులు కూడా వేలు, లక్షలు దాటి కోట్లకి పోయింది. తన లావాదేవీల కోసం ఏకంగా ముగ్గురు ఆడిటర్లను నియమించుకున్నాడు
ఇది కాకుండా
ఇది కాకుండా బంగారం వ్యాపారంలోకి దిగాడు ఇలా అంచలంచలుగా ఎదిగిన రమేష్ ఆస్థి రూ.150 కోట్లకి పెరిగింది. ఇటీవలే అధునాతనమైన భవనము కూడా కట్టుకున్నాడు.
రమేష్ ఆస్తుల
ఇవ్వని ఆరాతీసిన ఆదాయపన్ను అధికారులు రమేష్ ఆస్తులపై దాడి చేసారు. అధికారులు ఏకంగా మూడు రోజులు సోదాలు చేశారు. సోదా చేసిన అధికారులకి 8 కేజీల బంగారం మరియు రూ.150 కోట్ల విలువ చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో
ప్రస్తుతం కందిశెట్టి రమేష్ పరారీలో ఉన్నాడు అంటా. సంపాదించడం కంటే దాని దాచుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులే అని మరో సారి ఆదాయపు పన్ను అధికారులు నిరూపించారు.