ఇక నుంచి ఎటిఎం కష్టాలు ఉండవు ఇక్కడ కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు! అసలు ఎక్కడో తెలుసా?
బ్యాంకులు మరియు ఎటిఎంలు ద్వారా కాకుండా ఇప్పుడు అందరు ఈసేవ నుంచి కూడా డబ్బులు డ్రా చేసుకొనే విధానాన్ని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం.
టి.జె. వెంకటేశ్వర్ రావు
ఈ విధానం సోమవారం జూన్ 31 నుంచి అమలు కానుంది అని మీ సేవ రాష్ట్ర కమిషనర్ టి.జె. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆధార్ బాసిడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు.
4500 మీసేవ కేంద్రాలు
రాష్ట్రంలో 4500 మీసేవ కేంద్రాలు ఉన్నాయి కానీ బ్యాంకు ఎటిఎంలు అర్బన్ ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి సారి ఈ విధానం అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు
విత్ డ్రా
ప్రస్తుతానికి రోజుకి రూ.2000 మాత్రమే విత్ డ్రా అవుతుంది అని త్వరలో రోజుకి రూ.10000 విత్ డ్రా చేసుకొనే సౌకర్యం తెస్తాం అని అయన తెలిపారు.దీనికోసం కస్టమర్ల దగ్గర నుంచి ఎటువంటి టాక్స్ తీసుకోము అని అయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రములో
ఈ నెల చివరి అంటే ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రములో 60 మీసేవ కేంద్రాలలో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు అయన తెలిపారు. నెల తర్వాత మొత్తం రాష్ట్రము అంత ఈ సేవ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని అయన తెలిపారు.