ముకేశ్ అంబానీ మరియు అనిల్ అంబానీ వెరైటీ లీడర్లంటా మీరే చూడండి.
అంబానీలేంటి వెరైటీ లీడర్లేంటి అనుకోకండి. ప్రపంచ వినోద పరిశ్రమ రూపురేఖల్ని మార్చగలిగిన సత్తా ఉన్న 500 మంది అగ్ర నాయకులతో వెరైటీ మ్యాగజైన్ జాబితాను రూపొందించింది.
టాప్-500
ఈ టాప్-500 గ్లోబల్ లీడర్లలో బిలియనీర్ సోదరులైన ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు చోటు దక్కింది. మొత్తం 12 మంది భారతీయులకు ఈ ప్రతిష్ఠాత్మక లిస్టులో స్థానం లభించగా, వీరిలో అంబానీలతోపాటు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, రచయిత, దర్శకుడు కరణ్ జోహార్.
ఆదిత్యా చోప్రా
స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, యశ్ రాజ్ ఫిల్మ్స్ చైర్మన్ ఆదిత్యా చోప్రా, బాలాజీ టెలీఫిల్మ్స్ జాయింట్ ఎండీ ఎక్తా కపూర్, జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయెంకా, ఏరోస్ ఇంటర్నేషనల్ సీఈవో కిశోర్ లుల్లా, ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు సిద్ధార్థ్ కపూర్ ఉన్నారు.
వెబ్సైట్లో
2 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే నాయకులతో తయారైనదే మా ఈ వెరైటీ500 సూచీ అని తమ వెబ్సైట్లో వెరైటీ మ్యాగజైన్ పేర్కొన్నది
లిస్టును
ఏటా విడుదలయ్యే ఈ జాబితా కోసం వెరైటీ ఎడిటోరియల్ బోర్డు ప్రపంచ సినీ, టెలివిజన్ పరిశ్రమ పోకడల్ని నిశితంగా గమనిస్తుంది. ఆ తర్వాత అత్యంత ప్రభావశీలురతో లిస్టును సిద్ధం చేస్తుంది.
జియోతో
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ను ముకేశ్ అంబానీ తన రిలయన్స్ జియోతో షేక్ చేస్తున్నారని, 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని వెరైటీ మ్యాగజైన్ ఈ సందర్భంగా తెలిపింది.
నవ శకానికి
జియో రాకతో ఇంటర్నెట్ చౌకగా మారిందని, దాని వినియోగం కూడా పెరిగిపోయిందని, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఓ నవ శకానికి జియో నాంది పలికిందని కీర్తించింది.
అనిల్ అంబానీ సైతం
అనిల్ అంబానీ సైతం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో దూకుడును ప్రదర్శించారని, అటు సినిమా, ఇటు టెలివిజన్ విభాగాల్లో తనదైన ముద్ర వేసినట్లు చెప్పింది. ఆడ్ల్యాబ్స్ కొనుగోలుతోపాటు, స్టీవెన్ స్పీల్బర్గ్ డ్రీమ్వర్క్స్లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని గుర్తుచేసింది.