బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో అమెజాన్ వేర్హౌజ్!
దేశవ్యాప్తంగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న అమెజాన్... విజయవాడలో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంతకుముందు హైదరాబాద్లో ఫుల్ఫిల్ సెంటర్లను ఏర్పాటు చేసింది అమెజాన్.
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గోడౌన్ను ప్రారంభించబోతోంది అమెజాన్. ఇకపై ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ కస్టమర్లు ఆర్డర్లు ఇస్తే ఈ కేంద్రం నుంచే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. విజయవాడ ఎయిర్పోర్టుకు దగ్గర నగర శివారులో ఈ వేర్హౌస్ నిర్మించనుంది. రాష్ట్రంలోని 7,000 మంది సెల్లర్లు, అందులో విజయవాడ నుంచి 1400 మంది సెల్లర్లు అమెజాన్ ద్వారా తమ వస్తువుల్ని అమ్మనున్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్కు సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును వాడుకోవడం విశేషం. అమరావతిలో ఏర్పాటయ్యే అమెజాన్ కేంద్రం చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది కంపెనీ. అమెజాన్కు మొత్తం 13 రాష్ట్రాల్లో 15 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లున్నాయి. మొత్తం 50 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది అమెజాన్ లక్ష్యం. ఈ ఏడాది ఐదు గోడౌన్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో మొదటిదే అమరావతి కేంద్రం.