పెట్రోల్ ధరలు వరుసగా రెండవ రోజు పెరిగిగాయి:ధరలు చూడండి?
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) శుక్రవారం రెండవరోజు వరుసగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) శుక్రవారం రెండవరోజు వరుసగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి. ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) రేటు చార్ట్ ప్రకారం పెట్రోల్ ఇప్పుడు ఢిల్లీలో లీటరుకు రూ.76.76 రూపాయలు, ముంబైలో లీటరుకు రూ. 84.14 రూపాయలు. కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధర రూ.79.42 లీటరు మరియు రూ .79.67 రూపాయలు.అదేవిదంగా లీటరు డీజిల్కు ఢిల్లీలో రూ.68.43 డీజిల్ ముంబైలో లీటరుకు రూ.72.61 రూపాయలు, కోల్కతాలో రూ.70.98 రూపాయలు మరియు చెన్నైలో రూ.72.24 రూపాయలు,గా ఉన్నాయని దేశంలో అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఐఒసి పేర్కొంది.
పైన పేర్కొన్న రేట్లు జూలై 13, 2018 నాడు ఉదయం 6 గంటలకు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ఇంధన ధరలను రోజువారీ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. గత ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఢిల్లీలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి లీటర్ పెట్రోల్ రూ.78.43 రూపాయలు మరియు డీజిల్ ధర రూ.69.31 రూపాయలు ఈ ఏడాది మే 30 నాటికి నమోదయిన ధరలు,తరువాత తగ్గించారు.
గత సెషన్లో 5 శాతం క్షీణించిన తర్వాత అమెరికా క్రూడ్ 4 సెంట్లు తగ్గి 70.29 డాలర్లకు చేరింది. ఇది దాదాపు 5 శాతానికి తగ్గింది.
ఇది చైనా-యుఎస్ వాణిజ్య యుద్ధం గురించి ఆందోళనల నేపథ్యంలో లిబియా చమురును తిరిగి మార్కెట్లోకి తీసుకురావడంపై వ్యాపారులు బుధవారం భారీ నష్టాలను ఎదుర్కొంటున్న వారం గా అభివర్ణించారు.