కేంద్రం ఆర్బిఐ సమస్యల పై చర్చించేందుకు సిద్ధమన్నారు.
ప్రభుత్వ రంగానికి చెందిన రుణదాతలు నియంత్రించడంలో అధికారాలు లేకపోవడంతో రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్.
ప్రభుత్వ రంగానికి చెందిన రుణదాతలు నియంత్రించడంలో అధికారాలు లేకపోవడంతో రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13,500 కోట్ల కుంభకోణం బైటపడటం, పీఎస్బీల పర్యవేక్షణలో ఆర్బీఐ విఫలమైందన్న ఆరోపణలు రావడం సంగతి తెలిసిందే.
ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణలో ఉన్న అన్ని సమస్యలను ఆర్బీఐతో చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని గోయల్ పరిశ్రమ కార్యక్రమంలో చెప్పారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చడం ద్వారా వాటికి తగు తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు, 20 పీఎస్బీల్లో కేంద్రానికి ఉన్న మెజారిటీ వాటాలను తగ్గించేసుకోవాలన్న ప్రతిపాదనేదీ లేదని గోయల్ స్పష్టం చేశారు.
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల పట్ల తమ అంచనాలను తీర్చడంలో విశ్వసం కొలిపోయినదని గోయల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకులు తమకు ఉన్నతమైన ప్రమాణాలను, నైతిక విలువలను అంచనా వేయడంలో విఫలమయ్యాయని గోయల్ అన్నారు.
పీఎస్బీల్లో గతంలో రాజకీయ జోక్యం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితుల్లేవని గోయల్ అన్నారు.గోయల్ మాట్లాడుతూ అన్ని NPA లకు పరిహారం చెల్లించలేవు, ఎందుకంటే మొదట అసలైన వ్యాపార వైఫల్యాలు పరిష్కారం కావాలన్నారు.