కేంద్రానికి తెలంగాణ పై ఉన్న ప్రేమ మరో సారి నిరూపించుకుంది.. బయ్యారం స్టీల్ ప్లాంట్..
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామరావు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారిని కలిసి బయ్యారం స్టీల్ ప్లాంట్ మరియు ITIR (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రతిపాదన పునరుద్ధరించాలని కోరారు.
కె.టి.రామారావు
కె.టి.రామారావు గారు బుధవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలి అని అయన విజ్ఞప్తి చేశారు.
బయ్యారం ఉక్కు
కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని స్థాపించగల సాధ్యతను పరిశీలించడం. ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక స్థాయి కమిటీని నియమించింది 'అని మంత్రి చెప్పారు.
విశాఖపట్నంకు
విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో ఇనుప ఖనిజం రవాణా చేయబడుతోంది. కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారం నుంచి దానిని రవాణా చేయడం సమస్య కాదు అని అయన తెలిపారు.
ఉక్కు పథకం
ఈ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే, ఉక్కు పథకం క్రింద ఈ ప్రాంతంలో 15,000 గిరిజనులకు ఉద్యోగాలను ఈ పథకం అందిస్తుంది అని కె.టి. రామారావు గారు తెలిపారు.
ఐటి సంస్థలను ఆకర్షించేందుకు
హైదరాబాద్లోని ఐటీ హబ్ ప్రాంతాల్లో ఐటి సంస్థలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఐటిఐఆర్ పథకాన్ని పునరుద్ధరించడం ముఖ్యం అని తెలంగాణ ఐటీ మంత్రి అన్నారు.