జియో మరో కళ్ళు తిరిగే బంపర్ ఆఫర్ రూ.799 రీఛార్జ్ తో చూడండి.
టెలికాం రంగంలో సంచనాలకు మారు పేరైన రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్తో ముందుకు వస్తోంది. రూ.799 సరికొత్త ప్లాన్తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సిద్ధమైంది. ఈ రీచార్జితో రోజుకు 6.5జీబీ డేటాను వినియోగదారులకు అందించనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మామూలుగా అందించే డాటా ప్లాన్లో 1.5జబీ హైస్పీడ్ 4జీ ఇంటర్నెట్ డాటాను జియో అందిస్తోంది. కాగా ఈ ప్లాన్తో మొత్తం 182జీబీ డాటా వినియోగదారులకు చెల్లుబాటు కానుంది. అంటే రోజుకు 6.5జీబీ డాటా వినియోగదారులకు అందనుంది. దీంతో ఇప్పటి వరకు వస్తున్న డాటాకు అదనంగా రోజుకు 5జీబీ డాటా వినియోగంలోకి వస్తుంది.
దీంతో పాటు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, నేషనల్ కాల్స్.. ఎలాంటి రోమింగ్ చార్జీలు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు వినియోగంలో ఉంటాయని జియో సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.