KCR పథకాలు చంద్రబాబు నాయుడు ఖజానాను కాళీ చేస్తున్నాయా? చూడండి
అదేంటి KCR చేస్తున పనులకి చంద్రబాబు నాయుడు ఖజానా కాళీ అవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారా. ఒక్కసారి 2014 వెళ్లి జాగ్రత్తగా ఆలోచిస్తే అది నిజమే అని మీరే ఒప్పుకుంటారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం
అసలు విషయానికి వస్తే నాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకి అన్యాయం జరుగుతోంది అని కాబ్బటి మాకు ప్రతేక్య రాష్ట్రము కావాలి అని ప్రాణాలకు తెగించి పోరాటం చేసాడు కెసిఆర్.
తెలంగాణ ఉద్యమం
అయన ఆశయానికి తెలంగాణ ప్రజల ఆవేశం కూడా తోడు కలిసింది. తెలంగాణ ఉద్యమం దేశాన్ని మొత్తం ఆలోచింపచేసింది.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం
దాంతో దీని ప్లస్ చేసుకోవాలి అని చూసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే తెలంగాణను ప్రతేక్య రాష్ట్రంగా ప్రకటించింది.
చంద్రబాబు వంటి
అది నచ్చని చంద్రబాబు వంటి ఆంధ్ర నాయకులూ స్పెషల్ ఫ్లైట్ లలో వెళ్లి రాష్ట్ర విభజనను ఆపేసారు దంతో తెలంగాణాలో మరింత గొడవలు జరిగాయి. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు.
2014 జూన్ 2 న
చివరికి ఏమి చేసేది లేక 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది నాటి కేంద్ర ప్రభుత్వం. అప్పుడే రెండు రాష్ట్రాలలో ఎన్నికలు రావడం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.
రాజధాని లేక
ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇక్కడే అసలు కథ మొదలయింది.అప్పటి వరకు కళకళలాడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అప్పులో పడిపోయింది . నిధులు లేవు రాజధాని లేదు, ఏమి చేయాలో తెలియని సమయంలో చంద్రబాబు సీఎం అయ్యాడు.
తెలంగాణ విషయానికి వస్తే
ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వంటి రాజధాని ఉంది కావలసినన్ని నిధులు ఉన్నాయి. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ అందుకే ముఖ్యమంత్రి అయిన తొలిరోజు నుంచి తెలంగాణాని బంగారు తెలంగాణగా పెట్టి కొత్త పధకాలు చేస్తున్నారు కెసిఆర్.
పెద్ద షాక్
అక్కడే చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలింది. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది రాజధాని లేని ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తా అని ఎన్నికల ముందు చెప్పారు.
దీని నమ్మి
దీని నమ్మి పవన్ కళ్యాణ్ తో పాటు ఆంధ్ర ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసారు. కానీ కేంద్రం ఇస్తానన్న ప్రతేక్య హోదా ఇవ్వలేదు. కానీ ప్రతేక్య ప్యాకేజీ ఇస్తాం అని చంద్రబాబుకి ఆశ పెట్టారు.
పధకాలు
కెసిఆర్ తో పోటీ పడి మరి తెలంగాణాలో ఏమి పధకాలు ఉన్నాయో దాదాపుగా అన్ని పధకాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు అయేలా చూసాడు చంద్రబాబు.
పింఛన్లు
అందులో భాగంగా పింఛన్లు ఒక్కసారిగా రూ.1000 నుంచి రూ.1500 పెంచడం మరియు కల్యాణ లక్ష్మి వంటి పధకాలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు.
సొంత నిధులు
కానీ కేంద్రం నుండి తను అనుకున్న సహాయం రాలేదు. దాంతో చేసేది ఏమిలేక కేంద్రం ఇచ్చిన కొన్ని డబ్బులు తన సొంత నిధులు పెట్టి ఆ పధకాలను కొనసాగిస్తూ వచ్చారు.
వేతనాన్ని
ఇది ఇలా ఉంటే అసలే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రములోని హోమ్ గార్డ్ దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.600 రూపాయలకి పెంచి మంచి శుభవార్త చెప్పాడు.
కేంద్రం
ఇలా చంద్రబాబు నాయుడుకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది . అలాగని కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అని చంద్రబాబు ఏమి చేయలేను అంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదురుకోక తప్పదు.
దీనికంతా కారణం
దీనికంతా కారణం కెసిఆర్ కదా. అతను అభివృద్ధి పేరుతో ఎన్ని పధకాలు చేయకపోయింటే ఏదో చేసి బాబు గారు సక్సెస్ అయ్యేవారు కానీ కెసిఆర్ చేసిన పనికి బాబు చాలా పోగొట్టుకున్నాడు అని బయట అనుకుంటున్నారు.