ముకేశ్ అంబానీ ప్రయత్నం మరో సంచలనం కాబోతోందా?మీరే చూడండి.
టెలికం రంగంలో తనదైన ముద్రవేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ..ఇక ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారించారు.
అవకాశాలను
శరవేగంగా దూసుకుపోతున్న ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ముకేశ్ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఆఫ్లైన్ షాపింగ్
వినియోగదారులకు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ షాపింగ్లో నూతన అనుభవం కల్పించే విధంగా ఈ సేవలు ఉండబోతున్నాయట. ఇప్పటికే 4 వేల రిటైల్ స్టోర్లు, 50 గిడ్డంగులు, 4 వేల జియో పాయింట్లు కలిగివున్న సంస్థకు వినియోగదారులకు ఆన్లైన్ సేవలు అందించడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రముఖ ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది.
భారీగా రాయితీ
ప్రాంతీయంగా ఉన్న వ్యాపారులతో కుదుర్చుకున్న ఒప్పందంతో కొనుగోలుదారులకు భారీగా రాయితీ ఇచ్చేందుకు వీలు పడనున్నది.
ఈ-కామర్స్
ఇప్పటికే అహ్మదాబాద్కు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఇన్ఫీబీమ్లో పెట్టుబడులు పెట్టింది కూడా. 650 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ రిటైల్ ఇండస్ట్రీస్లో ఈ-కామర్స్ వాటా కేవలం 2-3 శాతమేనని.
అలీబాబా ఆన్లైన్
మిగతా ఎనిమిది శాతం ఆర్గనైజర్ రిటైలైర్లెన షాపర్స్ స్టాప్, బిగ్ బజార్లకు ఉన్నాయి. చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్నఅలీబాబా ఆన్లైన్ టు ఆఫ్లైన్ బిజినెస్ మోడల్ను తీసుకొచ్చి విజయవంతంగా అమలుపరిచింది.
ఆన్లైన్ టు ఆఫ్లైన్
తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి అడుగుపెట్టగలిగారు. రిలయన్స్ రిటైల్ ద్వారా ఇప్పటికే మన దేశ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఆఫ్లైన్ స్టోర్లను బాగానే కలిగి ఉంది. ఇక ఆన్లైన్ టు ఆఫ్లైన్ బిజినెస్ మోడల్ను ప్రాక్టికల్గా వర్కవుట్ చేయడమే తరువాయి.