ప్రస్తతం అటల్ పెన్షన్ యోజన కింద వచ్చే పెన్షన్ రెండింతలు కానుందా?
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) ద్వారా పెన్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ .5 ,000 నుండి రూ.10 ,000 కు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) ద్వారా పెన్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ .5 ,000 నుండి రూ.10 ,000 కు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
తాము ఈ ప్రతిపాదనను చూశామని మరియు అది మా చురుకైన పరీక్షలో ఉంది అని ఆర్థిక శాఖ DFS లోని ఉమ్మడి కార్యదర్శి మధ్ణేష్ కుమార్ మిశ్రా చెప్పారు. అటల్ పెన్షన్ యోజన కింద పింఛను విలువను పెంచే అవసరం ఉంది.
పిఎఫ్ఆర్డిఎ చైర్మన్ హేమంత్ జి కాంట్రాక్టర్ మాట్లాడుతూ 10.2 మిలియన్ల వద్ద ఉన్న APY యొక్క చందాదారుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక పంపంబడిందన్నారు.
ప్రస్తుతానికి, నెలకు 1,000-5000 రూపాయల నుంచి పెన్షన్ ఐదు స్లాబ్లను కలిగి ఉన్నామని ఆయన చెప్పారు. 60 ఏళ్ల వయస్సులో 5 వేల రూపాయలు, ఇది 20-30 సంవత్సరాలకు సరిపోతుందా అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, అధిక పింఛను మొత్తంలో అడుగుపెడుతున్న మార్కెట్ నుంచి భిన్నాభిప్రాయాలు చాల వచ్చాయని కాంట్రాక్టర్ అన్నారు.
పిఎఫ్ఆర్డి మంత్రిత్వ శాఖకు రెండు ప్రతిపాదనలను పంపింది - APY కోసం ఆటో నమోదు మరియు గరిష్ట వయస్సు సవరణ పథకానికి 50 సంవత్సరాలకు పెంచడం.
ప్రస్తుతం, APY కోసం నమోదు వయస్సు పరిమితి 18-40 సంవత్సరాలు. దీనిని 18-50 సంవత్సరాలకు పెంచడం చందాదారుల విస్తరణకు దోహదపడుతుందని కాంట్రాక్టర్ చెప్పారు.
2017-18లో ఈ పథకం కింద 5 మిలియన్ల కొత్త చందాదారులను పిఎఫ్ఆర్డిఎ జోడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మరో 6-7 మిలియన్లను చేర్చాలని భావిస్తోంది.