జియో వినియోగదారులకి డబల్ ధమాకా! ఏంటో చూడండి.
ప్రీ పెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో మరో ఆఫర్ను తీసుకువచ్చింది. 149 రూపాయల నుంచి 499 రూపాయల శ్రేణిలో గల అన్ని ప్రీ పెయిడ్ ప్లాన్లలోని వినియోగదారులకు అదనంగా 1.5 జిబి డేటాను ఆఫర్ చేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. ప్రస్తుతం 149, రూపాయలు, 349 రూపాయలు, 399 రూపాయలు, 449 రూపాయల ప్యాక్లోని వినియోగదారులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుండగా కొత్త ఆఫర్లో భాగంగా రోజుకు 3 జిబి డేటాను అందుకోనున్నారని వెల్లడించింది.
అలాగే రోజుకు 2 జిబి, 3జిబి, 4జిబి, 5 జిబి డేటా ప్యాక్లకు అదనంగా రోజుకు 1.5 జిబి డేటాను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ అదనపు డేటా ఆఫర్ ఈ నెల 12 నుంచి 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో వెల్లడించింది. కాగా మై జియో యాప్ ద్వారా 300 రూపాయలకు పైబడిన అన్ని రీచార్జ్లకు 100 రూపాయలు తగ్గించటమే కాకుండా 300 రూపాయల లోపు ఉన్న ప్లాన్లోని వినియోగదారులకు 20 శాతానికి పైగా డిస్కౌంట్ను ఇస్తోంది. ఎయిర్టెల్ 149సుకురావటం గమనార్హం.