పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయా?
గత రెండు వారల నుండి అమాంతరంగా పెరుగుతున్న ఇంధన ధరలపై గురువారం 1 పైసా తగ్గింది,ఇది సుమారు 7 పైసలు,5 పైసలు వరకు తగ్గొచ్చని పేర్కొంది.
గత రెండు వారల నుండి అమాంతరంగా పెరుగుతున్న ఇంధన ధరలపై గురువారం 1 పైసా తగ్గింది,ఇది సుమారు 7 పైసలు,5 పైసలు వరకు తగ్గొచ్చని పేర్కొంది. ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ.78.42 రూపాయల నుండి తగ్గి మే 30 న లీటరుకు రూ.78.35 రూపాయలు గా ఉంది.ముంబై లో లీటరు పెట్రోలు ధర రూ .86.16 చొప్పున ధరను నిర్ణయించింది. కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధరలు మే 31 న రూ .80.98, 81.35 గా ఉన్నాయి.
డీజిల్ ధర కూడా తగ్గింది. ఢిల్లీలో,డీజిల్ ధర రూ .69.25 వద్ద ఉంది, ఇది శుక్రవారం నాడు 69.30 రూపాయలుగా ఉంది. ముంబైలో డీజిల్ 73.73 రూపాయలుగా ఉంది.చెన్నై, కోల్కతాల్లో డీజిల్ ధర రూ. 73.12, రూ .71.80.
గత 16 రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు తగ్గించించడం ఇది రెండవ రోజు ఈ ధరలు కర్ణాటక ఎన్నికలకు దాదాపు మూడు వారాలు ఇంధన దరల మార్పులు జరగలేదు ,పెట్రోలు, డీజిల్ ధరలు పై లీటరుకు 1 పైసా తగ్గుంది.ఢిల్లీ లో పెట్రోలు ధర రూ.78.43 రూపాయలు మరియు డీజిల్ ధర రూ. 69.31 చొప్పున ఉంది.
స్థానిక అమ్మకపు పన్ను లేదా వాట్ ఆధారంగా రాష్ట్రాల మధ్య రాష్ట్రాల ధరలు మారుతూ ఉంటాయి. ఢిల్లీ అన్ని మెట్రో నగరాల కన్నా మరియు చాల రాష్ట్ర రాజధానుల ధరలు పోల్చి చూస్తే అత్యంత చౌక ధర. మే 14 నుంచి పెట్రోల్ ధర లీటరుకు 3.8 రూపాయలు, డీజిల్ ధర రూ .3.38 చొప్పున పెరిగింది.
నిన్న, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రారంభంలో ఇంధన రేట్లు 60 పైసలు తగ్గించాయని ప్రకటించింది,పెట్రోల్ మరియు డీజిల్ మే 30, 2018 అమ్మకాల ధరలు తమ వెబ్సైట్లో సవరించబడ్డాయన్నారు. నేడు, ఇంధన ధరలలో స్వల్ప తగ్గింపు ఉంది.