పతంజలి కొత్త సిమ్ కార్డులు కొంటే రూ.5 లక్షల జీవిత భీమా! జియో చెక్ పెట్టనుందా?
యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ మరింతగా విస్తరిస్తోంది. స్వదేశీ ఉత్పత్తుల నినాదంతో కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్గా నిలదొక్కుకున్న పతంజలి.
బీఎస్ఎన్ఎల్
ఇప్పుడు టెలీకాం రంగంలోకి అడుగుపెట్టింది. టెలీకాం రంగంలోనూ స్వదేశీయతను చాటేలా ప్రభుత్వ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో జతకట్టింది.
బాబా రాందేవ్
ఈ మేరకు ‘స్వదేశీ సమృద్ధి సిమ్' కార్డ్స్ పేరిట ఆదివారం పతంజలి సిమ్ కార్డులను విడుదల చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ స్వయంగా ఈ సిమ్ కార్డులను విడుదల చేశారు.
టెలీ సర్వీసులే కాకుండా
పతంజలి వెల్లడించిన వివరాల ప్రకారం .ఈ సిమ్ కార్డులతో 2జీబీ డాటా, అపరిమిత కాలింగ్ ప్లాన్లను అందజేస్తారు. కేవలం టెలీ సర్వీసులే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా ఈ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ద్వారా అందించనున్నట్లు పతంజలి వెల్లడించింది.
పతంజలి ఉద్యోగులు మాత్రమే
అయితే ఈ సిమ్ కార్డులు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రస్తుతం కేవలం పతంజలి ఉద్యోగులు మాత్రమే పొందడానికి వీలుంది. సామాన్యులకు ఈ సిమ్ కార్డులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో పతంజలి వెల్లడించలేదు
పతంజలి ఉత్పత్తులపై
అయితే రాబోయే కొద్ది నెలల్లో ఈ సిమ్ కార్డులు అందరికీ అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, ఈ సిమ్ కార్డును కొనుగోలు చేసిన వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.144 రీచార్జ్తో అపరిమిత సేవలుమీరు పొందచ్చు