ఇండియన్ ఆయిల్ సంస్థ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ పెట్టుబడులు?
దేశంలోని అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ .1,387 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
తెలంగాణ / హైదరాబాద్: దేశంలోని అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ .1,387 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో 827 కోట్ల రూపాయల పెట్టుబడులు మరియు తెలంగాణలో రెండు మూడు సంవత్సరాలలో 560 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాం 'అని ఐఒసి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ విలేకరులకు చెప్పారు.
నల్గొండలో 67.33 ఎకరాల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, మరో 10 ఎకరాల కొనుగోలు ప్రక్రియలో ఉన్నామని ఆయన అన్నారు. చర్లపల్లి మరియు తిమ్మాపూర్ బాట్లింగ్ ప్లాంట్లు వద్ద LPG సామర్థ్యం మెరుగుపరచడానికి కోటి పెట్టుబడి పెట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు విశాఖపట్నం సమీపంలో కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం 60 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం 320 కోట్లు అని అన్నారు.
అదేవిధంగా, గుంతకల్లు సమీపంలో 83 ఎకరాల స్థలంలో కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం ప్రాజెక్టుకు ఇప్పటికే 350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించారు.
వీటితో పాటు, విజయవాడ టెర్మినల్ ప్రాజెక్ట్, వైజాగ్ టెర్మినల్ను పునరుద్ధరించడం, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టుల కింద చేపట్టారు.
పారాదీప్-హైదరాబాద్ పైప్లైన్ ప్రాజెక్ట్లో 4.55 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో, వివిధ ప్రదేశాల్లో భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం పనులు ప్రాంభించమని ఆయన పేర్కొన్నారు.
2020 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నామని పరదీప్-వైజాగ్-విజయవాడ-సూర్యపేట-హైదరాబాద్కు ఈ లైన్ను కమీషన్ పూర్తి చేస్తామన్నారు.
కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ బ్రాండింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా హెడ్, సుబోధ్ దక్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఖజానాకు 3,838 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 3,171 కోట్ల రూపాయలు కేటాయిన్చామన్నారు.