ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ మరో అడుగు ఏంటో మీరే చూడండి!
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై రిలయన్స్ గ్రూప్ ఆసక్తిని చూపుతోంది. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.
ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
త్వరలో పిలిచే టెండర్లలో తాము కూడా పాల్గొంటామని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చింది. ఆపై ఎయిర్పోర్టును నిర్మించలేమని చెప్పేసింది
అనిల్ అంబానీ
దీంతో ఈ సంస్థను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తూ భోగాపురం ఎయిర్పోర్టు కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ప్రఖ్యాత సంస్థలేమైనా ముందుకు వస్తాయేమోనని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబుతో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సమావేశమయ్యారు.
రూ.5వేల కోట్ల పెట్టుబడులతో
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విశాఖ జిల్లా రాంబిల్లిలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో నావల్ షిప్బిల్డింగ్కు సంబంధించి 2వేల ఎకరాలు కేటాయించాలని అంబానీ కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అనిల్ పేర్కొన్నారని సమాచారం.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం
4వేల మెగావాట్ల నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అలా్ట్ర పవర్ ప్రాజెక్టుపై ఇక ముందుకెళ్లలేమని అంబానీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల సామర్లకోటలోని రిలయన్స్ ఎనర్జీ 220మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని డిస్కమ్లు రద్దు చేసుకున్నాయి.
ఏపీ జెన్కో ఎండీ
ఈ అంశమూ భేటీలో చర్చకు వచ్చింది. పీపీఏల కాలపరిమితి ముగియడంతో రద్దు నోటీసును ఇప్పటికే జారీ చేశామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వివరించారు.