For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో యూజర్స్ కు మరో భారీ ఆఫర్ ప్రకటన ఇక నుంచి రూ.199 కే ఏంటో చూడండి.

By Sabari
|

రిలయన్స్‌ జియో సరికొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ 'జీరో టచ్‌'ను అందుబాటులోకి తెచ్చింది. దీని నెలవారీ అద్దె 199 రూపాయలు. ఈ ప్లాన్‌ కింద నిమిషానికి 50 పైసల ప్రారంభ ధరతో అమెరికా, కెనడాకు కాల్స్‌ మాట్లాడవచ్చు. రోమింగ్‌లో చేసే కాల్స్‌పైనా తక్కువ చార్జీలనే వసూలు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ చార్జీ నిమిషానికి 2 రూపాయల నుంచి ఉంటుందని పేర్కొంది. వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎ్‌సలకు ఈ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. మే 15వ తేదీ నుంచి ఈ ప్లాన్‌ అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ 309 రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది. ఇక 199 రూపాయల ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్‌ కింద ఉచిత వాయిస్‌, ఎస్‌ఎంఎ్‌సలు, 25 జిబి 4జి డేటా లభిస్తుంది.

జియో యూజర్స్ కు మరో భారీ ఆఫర్ ప్రకటన ఇక నుంచి రూ.199 కే ఏంటో చూడండి.

ఇక విదేశాలకు చేసే కాల్‌ చార్జీల విషయానికొస్తే.. అమెరికా, కెనడాకు నిమిషానికి 50 పైసలు, చైనా, ఫ్రాన్స్‌, ఇటలీ, యుకె, సింగపూర్‌, బంగ్లాదేశ్‌కు నిమిషానికి 2 రూపాయలు, ఆస్ర్టేలియా, బహ్రెయిన్‌కు నిమిషానికి 4 రూపాయలు, కువైట్‌కు నిమిషానికి 5 రూపాయలు, సౌదీ అరేబియా, యుఎఇకి నిమిషానికి 6 రూపాయలుగా ఉన్నట్టు జియో తెలిపింది. కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.

Read more about: jio reliance jio offers reliance jio
English summary

జియో యూజర్స్ కు మరో భారీ ఆఫర్ ప్రకటన ఇక నుంచి రూ.199 కే ఏంటో చూడండి. | Jio Postpaid Is Here With New Rs. 199 Plan Offering 25GB Data and Other Benefits

.Reliance Jio on Thursday unveiled Jio Postpaid, its first real step towards the smaller segment of India's telecom market.
Story first published: Friday, May 11, 2018, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X