జియో యూజర్స్ కు మరో భారీ ఆఫర్ ప్రకటన ఇక నుంచి రూ.199 కే ఏంటో చూడండి.
రిలయన్స్ జియో సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ 'జీరో టచ్'ను అందుబాటులోకి తెచ్చింది. దీని నెలవారీ అద్దె 199 రూపాయలు. ఈ ప్లాన్ కింద నిమిషానికి 50 పైసల ప్రారంభ ధరతో అమెరికా, కెనడాకు కాల్స్ మాట్లాడవచ్చు. రోమింగ్లో చేసే కాల్స్పైనా తక్కువ చార్జీలనే వసూలు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ చార్జీ నిమిషానికి 2 రూపాయల నుంచి ఉంటుందని పేర్కొంది. వాయిస్, డేటా, ఎస్ఎంఎ్సలకు ఈ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. మే 15వ తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ 309 రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది. ఇక 199 రూపాయల ప్లాన్ను ఎంచుకునే కస్టమర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ కింద ఉచిత వాయిస్, ఎస్ఎంఎ్సలు, 25 జిబి 4జి డేటా లభిస్తుంది.
ఇక విదేశాలకు చేసే కాల్ చార్జీల విషయానికొస్తే.. అమెరికా, కెనడాకు నిమిషానికి 50 పైసలు, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, యుకె, సింగపూర్, బంగ్లాదేశ్కు నిమిషానికి 2 రూపాయలు, ఆస్ర్టేలియా, బహ్రెయిన్కు నిమిషానికి 4 రూపాయలు, కువైట్కు నిమిషానికి 5 రూపాయలు, సౌదీ అరేబియా, యుఎఇకి నిమిషానికి 6 రూపాయలుగా ఉన్నట్టు జియో తెలిపింది. కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.